Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:10 AM

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా.

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా.

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా.
03-06-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాలలో ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాక ఆవిష్కరణ.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిట్యాల పట్టణంలో సోమవారం పలు ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో విజయ్‌కుమార్,

ఎంపీడీవో కార్యాలయంలో ఇన్‌చార్జి ఎంపీడీవో మనోహర్,

పోలీస్ స్టేషన్‌లో సీఐ నాగరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి .


తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం నిర్వహించిన కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అనేక ఉద్యమాలు, పోరాటాలు, త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో విశేష పురోగతి సాధించిందని తెలిపారు. దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతున్నదని, యువతకు ఉపాధి అవకాశాల కల్పనతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని వివరించారు.భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయమైన తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతుండగా, ఈ అభివృద్ధి యాత్రలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, రాజకీయ నాయకులు, సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా.

Article Image

చిట్యాలలో ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాక ఆవిష్కరణ.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిట్యాల పట్టణంలో సోమవారం పలు ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో విజయ్‌కుమార్,

ఎంపీడీవో కార్యాలయంలో ఇన్‌చార్జి ఎంపీడీవో మనోహర్,

పోలీస్ స్టేషన్‌లో సీఐ నాగరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి .


తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం నిర్వహించిన కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అనేక ఉద్యమాలు, పోరాటాలు, త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో విశేష పురోగతి సాధించిందని తెలిపారు. దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతున్నదని, యువతకు ఉపాధి అవకాశాల కల్పనతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని వివరించారు.భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయమైన తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతుండగా, ఈ అభివృద్ధి యాత్రలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, రాజకీయ నాయకులు, సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News