Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి కుటుంబానికీ బీమా రక్షణ అవసరం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 08:25 PM

టీజీఎస్ ఆర్టీసీలో ఘనంగా జాతీయ భద్రతా వారోత్సవాలు

టీజీఎస్ ఆర్టీసీలో ఘనంగా జాతీయ భద్రతా వారోత్సవాలు

టీజీఎస్ ఆర్టీసీలో ఘనంగా జాతీయ భద్రతా వారోత్సవాలు
March 04, 2026 06:24 PM 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

ఉద్యోగుల భద్రతకే మా తొలి ప్రాధాన్యత : వీసీ & ఎండీ వై.నాగిరెడ్డి.

​జాతీయ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలు, వర్క్‌షాప్‌లు మరియు ఉత్పత్తి యూనిట్లలో భద్రతా వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం అన్ని యూనిట్లలో 'భద్రతా దినోత్సవాన్ని' నిర్వహించి, సిబ్బందికి భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించారు.

​ఈ సందర్భంగా హైదరాబాద్ బస్ భవన్ లో టీజీఎస్ ఆర్టీసీ వీసీ & ఎండీ వై.నాగిరెడ్డి మాట్లాడుతూ.కార్పొరేషన్‌లో పనిచేసే ప్రతి ఉద్యోగి, సూపర్వైజర్ ల భద్రత సంబంధిత అధికారులు తమ ప్రాథమిక బాధ్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ "కార్మికులు, ఉద్యోగుల భద్రతే మా ప్రధాన ధ్యేయమని. బస్ డిపోలు , వర్క్‌షాప్‌లలో భారీ యంత్రాలు, వెల్డింగ్ పరికరాలు, ఇంధన నిర్వహణ వంటి క్లిష్టమైన పనులు చేసేటప్పుడు కార్మికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి" అని ఆయన సూచించారు.

ప్రతి సంవత్సరం మార్చి 4న జాతీయ భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటామని, ఈ ఏడాది వారం రోజుల పాటు అట్టడుగు స్థాయి వరకు అవగాహన కల్పించేలా భద్రతా వారోత్సవాలు నిర్వహించేలా అన్ని గ్యారేజీలు, జోనల్ వర్క్‌షాప్‌లు మరియు బాడీ బిల్డింగ్ యూనిట్లకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎండీ నాగిరెడ్డి తెలిపారు.

సురక్షితమైన పని వాతావరణం వల్ల ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ లభించడమే కాకుండా, సంస్థ యొక్క ఖ్యాతి కూడా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశ్యాలు

ప్రమాదాల నివారణ : యాంత్రిక గాయాలు, విద్యుత్ షాక్‌లు మరియు అగ్ని ప్రమాదాలను అరికట్టడం.

నిరంతర అభ్యాసం మరియు అవగాహన ద్వారా పని ప్రదేశాల్లో బలమైన భద్రతా వాతావరణాన్ని నిర్మించడం.

వృత్తిపరమైన ఆరోగ్య సమస్యలు మరియు రసాయన పొగలకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం.

ఉత్పాదకత పెంపు

సురక్షితమైన పని పద్ధతుల ద్వారా సంస్థ ఆస్తులను కాపాడుతూ, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం.

​ఈ కార్యక్రమంలో సిహెచ్.వెంకన్న, ఈడీ ( ఇ & ఎఎమ్ ), పలువురు ఉన్నతాధికారులు పాల్గొని భద్రతా ప్రతిజ్ఞ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News