టైక్వాండో పోటీల్లో స్వర్ణ విజేతగా నిలిచిన నాగార్జున కళాశాల విద్యార్థి
టైక్వాండో పోటీల్లో స్వర్ణ విజేతగా నిలిచిన నాగార్జున కళాశాల విద్యార్థి
స్థానికం బృందం
నల్గొండ: నల్గొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల (ఆటానమస్)కు చెందిన ఎన్. మనోజ్ యాదవ్ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్ కళాశాల టైక్వాండో పోటీలలో అద్భుత ప్రతిభ కనబరచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 2025–26 సంవత్సరానికి నిర్వహించిన ఈ పోటీలలో 80 కిలోల లోపు విభాగంలో అతడు ప్రథమ స్థానం సాధించి కళాశాలకు కీర్తి తీసుకొచ్చాడు.
ఈ విజయంతో మనోజ్ యాదవ్ అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. మార్చి 16 నుంచి 20 వరకు పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ పట్టణంలో డేవ్ విశ్వవిద్యాలయంలో జరగనున్న పోటీలలో పాల్గొననున్నాడు.
విద్యార్థి విజయంపై కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక వర్గం హర్షం వ్యక్తం చేశారు. శారీరక విద్య విభాగాధిపతి డాక్టర్ అదే మల్లేశం మార్గదర్శకత్వంలో క్రమశిక్షణతో సాధన చేసి ఈ స్థాయికి చేరుకున్నాడని పేర్కొన్నారు. క్రీడలతో పాటు విద్యలోనూ రాణించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎం. వెంకటరెడ్డి, డాక్టర్ వెంకటేశం, నర్సింగ్ కోటయ్య, మన్నెం వెంకటయ్యతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొని మనోజ్ను అభినందించారు. కళాశాల విద్యార్థులకు అతని విజయం గర్వకారణంగా నిలిచింది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి