PRINT TIME: April 20, 2026 12:11 AM
సుద్దకుంటపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
సుద్దకుంటపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
April 19, 2026 10:23 PM
4 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని సుద్దకుంటపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి యన్.నారా చంద్రబాబు నాయుడు ముందస్తు జన్మదినం సందర్భంగా గ్రామ ప్రజలకు మరియు పరిసర గ్రామాల ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరంలో వైద్యులు ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు, ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందించడం లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు.
గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గ్రామ యువనాయకులు సి.రవి మరియు నవీన్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి