సృష్టికి మూలం స్త్రీ – ప్రతి ఆడబిడ్డను తల్లిగా చూడాలి : మౌలానా మొహమ్మద్ ఇలియాజ్
సృష్టికి మూలం స్త్రీ – ప్రతి ఆడబిడ్డను తల్లిగా చూడాలి : మౌలానా మొహమ్మద్ ఇలియాజ్
EDIGA NAVEENKUMAR
సోమందేపల్లి: పవిత్ర రంజాన్ మాసంలో 18వ ఉపవాస దీక్షను ముస్లిం మైనారిటీ సోదరులు ఆదివారం ప్రారంభించారు. సోమందేపల్లిలోని జామియా మసీదులో తెల్లవారుజామున ఫజర్ నమాజ్ అనంతరం ఈ ఉపవాస దీక్ష మొదలైంది.
ఈ సందర్భంగా మౌలానా మొహమ్మద్ ఇలియాజ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రసంగించారు. స్త్రీ లేకపోతే జననం లేదని, స్త్రీ లేకుంటే జీవితం లేదని, అసలు ఈ సృష్టి కూడా ఉండదని తెలిపారు.
స్త్రీ ఓ తల్లిగా, అక్కగా, చెల్లిగా, స్నేహితురాలిగా, భార్యగా, కూతురుగా అనేక పాత్రల్లో సమాజంలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉందన్నారు. ప్రతి ఒక్కరు ప్రతి స్త్రీలో తమ తల్లి, అక్క, చెల్లిని చూసి గౌరవించాలన్నారు.
ప్రతి స్త్రీకి అల్లాహ్ తోడుగా ఉండాలని, వారు కోరుకున్న ప్రతి కార్యంలో విజయం సాధించాలని ప్రార్థించారు. ప్రతి మగాడు స్త్రీని గౌరవించి, వారికి తోడుగా, నీడగా ఉండి, జీవితంలో సహాయకుడిగా ఉండాలని సూచించారు.
అనంతరం మౌలానా మొహమ్మద్ ఇలియాజ్ ప్రత్యేక దువా చేశారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి