సూర్యాపేట 33వ వార్డు విద్యానగర్ నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థిగా కొన్నె మంజుల గౌడ్ బరిలో
సూర్యాపేట 33వ వార్డు విద్యానగర్ నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థిగా కొన్నె మంజుల గౌడ్ బరిలో
Biksham
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 33వ వార్డు (విద్యానగర్) జనరల్ రిజర్వేషన్గా ఖరారైన నేపథ్యంలో, ఈ వార్డు నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున కొన్నె మంజుల గౌడ్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ సందర్భంగా కొన్నె మంజుల గౌడ్ మాట్లాడుతూ, గతంలో బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్వో) గా సేవలందించిన అనుభవంతో ప్రజల సమస్యలు, ఓటర్ల అవసరాలు తనకు పూర్తిగా తెలుసునని తెలిపారు. బీఎల్వోగా పనిచేసిన కాలంలో నిష్పక్షపాతంగా, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించడంతో పాటు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండడం వల్ల వార్డు ప్రజలకు తాను సుపరిచితురాలినని పేర్కొన్నారు. 33వ వార్డు అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, పారిశుధ్యం, తాగునీరు, రోడ్లు, వీధి దీపాలు వంటి సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రజల నమ్మకంతో కౌన్సిలర్గా గెలిపించాలని ఆమె ఈ సందర్భంగా వార్డు ప్రజలను కోరారు. విద్యానగర్ను ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దేందుకు అంకితభావంతో పనిచేస్తానని, ప్రతి సమస్యపై పోరాటం చేస్తానని కొన్నె మంజుల గౌడ్ హామీ ఇచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి