Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడే మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష కదం తొక్కిన గిల్.. కోల్‌కతాపై గుజరాత్‌ ఘన విజయం రైతు కుటుంబానికి అండగా రెడ్స్ సంస్థ ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 18, 2026 08:09 PM

సోమందేపల్లిలో గ్యాస్ కొరతపై ఆందోళన – సకాలంలో సరఫరా చేయాలని సిపిఐ డిమాండ్

సోమందేపల్లిలో గ్యాస్ కొరతపై ఆందోళన – సకాలంలో సరఫరా చేయాలని సిపిఐ డిమాండ్

సోమందేపల్లిలో గ్యాస్ కొరతపై ఆందోళన – సకాలంలో సరఫరా చేయాలని సిపిఐ డిమాండ్
April 18, 2026 06:24 PM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో గ్యాస్ కొరత కారణంగా వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ బుకింగ్ చేసుకున్న ప్రతి వినియోగదారునికి సకాలంలో సిలిండర్లు అందేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

సాధారణంగా పెనుకొండలోని శ్రీ రాఘవేంద్ర ఇండానే గ్యాస్ ఏజెన్సీ నుంచి సోమందేపల్లికి రోజుకు 60 సిలిండర్లు సరఫరా అయ్యేవి. అయితే అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడడంతో డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో శనివారం కేవలం 32 సిలిండర్లు మాత్రమే సరఫరా కావడంతో ముందుగా బుకింగ్ చేసుకున్న సుమారు 60 మంది వినియోగదారులు నిరాశకు గురయ్యారు.

ఈ విషయంపై స్థానిక గ్యాస్ సిబ్బందిని సిపిఐ నాయకులు ప్రశ్నించగా, డిమాండ్ అధికంగా ఉండటంతో సరఫరా తగ్గిందని వారు తెలిపారు. అనంతరం ఏజెన్సీ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి మునుపటిలాగే 60 సిలిండర్లు పంపాలని కోరినా స్పందన రాకపోవడంతో వినియోగదారులతో కలిసి సిపిఐ నాయకులు హిందూపురం రహదారిపై నిరసన చేపట్టారు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్యాస్ ఏజెన్సీతో మాట్లాడిన అనంతరం అదనంగా 20 సిలిండర్లు సోమందేపల్లికి పంపించారు. వాటిని సిపిఐ నాయకుల సమక్షంలో వినియోగదారులకు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బాలస్వామి, జిల్లా కౌన్సిల్ సభ్యులు శీలా నారాయణస్వామి, మండల సహాయ కార్యదర్శి అంజనమ్మతో పాటు పలువురు వినియోగదారులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News