Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీటీ రోడ్లుగా మార్చాలని సిపిఎం డిమాం రెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహ కార్యక్రమం ఉధంపూర్‌లో ఘోర ప్రమాదం: 100 అడుగుల లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 20, 2026 06:27 PM

సోమందేపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ధర్నా

సోమందేపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ధర్నా

సోమందేపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ధర్నా
April 20, 2026 03:16 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

సోమందేపల్లి, ఏప్రిల్ 20: సోమందేపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మండల సమితి ఆధ్వర్యంలో సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో జి. మారుతి కి వినతిపత్రం అందజేశారు.

మండల కేంద్రంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వినియోగదారులకు సరైన విధంగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయడం లేదని సిపిఐ నాయకులు ఆరోపించారు. ప్రతిరోజూ సుమారు 60 సిలిండర్లను ఇంటింటికి పంపిణీ చేయాల్సి ఉండగా, కేవలం 30 సిలిండర్లను మాత్రమే ఒకే చోట వినియోగదారులను సమీకరించి పంపిణీ చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

బుక్ చేసుకున్న వినియోగదారులందరికీ గ్యాస్ సక్రమంగా, సమయానికి పంపిణీ చేయాలని, లేనిపక్షంలో సంబంధిత గ్యాస్ ఏజెన్సీని రద్దు చేసి సరైన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వోను కోరారు.

ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా కార్యవర్గ సభ్యులు బాలస్వామి, మండల కార్యదర్శి రాజగోపాల్, సహాయ కార్యదర్శులు అంజనమ్మ, చాంద్ బాషా, జిల్లా కౌన్సిల్ సభ్యులు షీలా, నారాయణస్వామి, మండల సమితి సభ్యులు నరసింహమూర్తి, ఆంజనేయులు, ఈడిగ నాగరాజు, మహిళా సంఘం నాయకులు నూర్జాన్, రామాంజనేయులు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News