Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:32 AM

సోమందేపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ధర్నా

సోమందేపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ధర్నా

సోమందేపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ధర్నా
20-04-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

సోమందేపల్లి, ఏప్రిల్ 20: సోమందేపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మండల సమితి ఆధ్వర్యంలో సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో జి. మారుతి కి వినతిపత్రం అందజేశారు.

మండల కేంద్రంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వినియోగదారులకు సరైన విధంగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయడం లేదని సిపిఐ నాయకులు ఆరోపించారు. ప్రతిరోజూ సుమారు 60 సిలిండర్లను ఇంటింటికి పంపిణీ చేయాల్సి ఉండగా, కేవలం 30 సిలిండర్లను మాత్రమే ఒకే చోట వినియోగదారులను సమీకరించి పంపిణీ చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

బుక్ చేసుకున్న వినియోగదారులందరికీ గ్యాస్ సక్రమంగా, సమయానికి పంపిణీ చేయాలని, లేనిపక్షంలో సంబంధిత గ్యాస్ ఏజెన్సీని రద్దు చేసి సరైన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వోను కోరారు.

ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా కార్యవర్గ సభ్యులు బాలస్వామి, మండల కార్యదర్శి రాజగోపాల్, సహాయ కార్యదర్శులు అంజనమ్మ, చాంద్ బాషా, జిల్లా కౌన్సిల్ సభ్యులు షీలా, నారాయణస్వామి, మండల సమితి సభ్యులు నరసింహమూర్తి, ఆంజనేయులు, ఈడిగ నాగరాజు, మహిళా సంఘం నాయకులు నూర్జాన్, రామాంజనేయులు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సోమందేపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ధర్నా

Article Image

సోమందేపల్లి, ఏప్రిల్ 20: సోమందేపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మండల సమితి ఆధ్వర్యంలో సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో జి. మారుతి కి వినతిపత్రం అందజేశారు.

మండల కేంద్రంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వినియోగదారులకు సరైన విధంగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయడం లేదని సిపిఐ నాయకులు ఆరోపించారు. ప్రతిరోజూ సుమారు 60 సిలిండర్లను ఇంటింటికి పంపిణీ చేయాల్సి ఉండగా, కేవలం 30 సిలిండర్లను మాత్రమే ఒకే చోట వినియోగదారులను సమీకరించి పంపిణీ చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

బుక్ చేసుకున్న వినియోగదారులందరికీ గ్యాస్ సక్రమంగా, సమయానికి పంపిణీ చేయాలని, లేనిపక్షంలో సంబంధిత గ్యాస్ ఏజెన్సీని రద్దు చేసి సరైన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వోను కోరారు.

ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా కార్యవర్గ సభ్యులు బాలస్వామి, మండల కార్యదర్శి రాజగోపాల్, సహాయ కార్యదర్శులు అంజనమ్మ, చాంద్ బాషా, జిల్లా కౌన్సిల్ సభ్యులు షీలా, నారాయణస్వామి, మండల సమితి సభ్యులు నరసింహమూర్తి, ఆంజనేయులు, ఈడిగ నాగరాజు, మహిళా సంఘం నాయకులు నూర్జాన్, రామాంజనేయులు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News