సోమందేపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ధర్నా
సోమందేపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ధర్నా
Prakash
సోమందేపల్లి, ఏప్రిల్ 20: సోమందేపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మండల సమితి ఆధ్వర్యంలో సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో జి. మారుతి కి వినతిపత్రం అందజేశారు.
మండల కేంద్రంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వినియోగదారులకు సరైన విధంగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయడం లేదని సిపిఐ నాయకులు ఆరోపించారు. ప్రతిరోజూ సుమారు 60 సిలిండర్లను ఇంటింటికి పంపిణీ చేయాల్సి ఉండగా, కేవలం 30 సిలిండర్లను మాత్రమే ఒకే చోట వినియోగదారులను సమీకరించి పంపిణీ చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
బుక్ చేసుకున్న వినియోగదారులందరికీ గ్యాస్ సక్రమంగా, సమయానికి పంపిణీ చేయాలని, లేనిపక్షంలో సంబంధిత గ్యాస్ ఏజెన్సీని రద్దు చేసి సరైన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వోను కోరారు.
ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా కార్యవర్గ సభ్యులు బాలస్వామి, మండల కార్యదర్శి రాజగోపాల్, సహాయ కార్యదర్శులు అంజనమ్మ, చాంద్ బాషా, జిల్లా కౌన్సిల్ సభ్యులు షీలా, నారాయణస్వామి, మండల సమితి సభ్యులు నరసింహమూర్తి, ఆంజనేయులు, ఈడిగ నాగరాజు, మహిళా సంఘం నాయకులు నూర్జాన్, రామాంజనేయులు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి