సోమందేపల్లి పోలీస్ పనితీరు – నెలలోనే గణనీయ మార్పు
సోమందేపల్లి పోలీస్ పనితీరు – నెలలోనే గణనీయ మార్పు
Prakash
సత్యసాయి జిల్లా, సోమందేపల్లి పోలీస్ స్టేషన్లో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేవలం నెల రోజుల వ్యవధిలోనే శాంతి భద్రతల పరిరక్షణలో విశేష పురోగతి కనిపించింది. మండలంలో నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల తగ్గింపు దిశగా చేపట్టిన చర్యలు ఫలితాలిస్తున్నాయి.
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటూ బైండోవర్ కేసులు నమోదు చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఫోర్ఫీచర్ చర్యలు అమలు చేశారు.
గతంలో సమస్యగా ఉన్న గంజా బాచ్ కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోవడం విశేషం.
పోలీసులు చేపట్టిన ముఖ్య చర్యలు:
• డ్రంకెన్ డ్రైవ్, బైక్ రేసింగ్, పేకాట, ఓపెన్ డ్రింకింగ్ కేసులపై కఠిన చర్యలు
• యువతకు కౌన్సిలింగ్ – ప్రమాదకర ప్రవర్తనలకు చెక్
• రోడ్డు భద్రతపై ప్రత్యేక చర్యలు
• గుజిరి షాపులపై అవగాహన – దొంగ సరుకుల నియంత్రణ
• గ్రామ సభల ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం
• పోక్సో, డ్రగ్స్, సైబర్ క్రైమ్పై అవగాహన కార్యక్రమాలు
• డీజేలు, అధిక శబ్దాలపై నియంత్రణ
• రైతులకు రోడ్డు భద్రతపై సూచనలు
ఈ కృషిని గుర్తించిన జిల్లా ఎస్పీ శ్రీ యస్. సతీష్ కుమార్ (ఐపీఎస్), జిల్లా క్రైమ్ మీటింగ్లో సోమందేపల్లి పోలీస్ స్టేషన్ను ప్రశంసిస్తూ ప్రశంస పత్రం మరియు నగదు బహుమతి అందజేశారు.
????️ ఎస్ఐ జి. సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ,
“ఈ గుర్తింపు మాకు మరింత బాధ్యతను పెంచింది. ప్రజల భద్రత కోసం మరింత కట్టుదిట్టంగా పనిచేస్తాం” అని తెలిపారు.
ప్రజలకు విజ్ఞప్తి:
చట్టాలను గౌరవిస్తూ, పోలీసులకు సహకరించి, నేరాలు మరియు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి