Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 12:25 AM

సోమందేపల్లి పోలీస్ పనితీరు – నెలలోనే గణనీయ మార్పు

సోమందేపల్లి పోలీస్ పనితీరు – నెలలోనే గణనీయ మార్పు

సోమందేపల్లి పోలీస్ పనితీరు – నెలలోనే గణనీయ మార్పు
April 18, 2026 02:13 PM 99 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

సత్యసాయి జిల్లా, సోమందేపల్లి పోలీస్ స్టేషన్‌లో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేవలం నెల రోజుల వ్యవధిలోనే శాంతి భద్రతల పరిరక్షణలో విశేష పురోగతి కనిపించింది. మండలంలో నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల తగ్గింపు దిశగా చేపట్టిన చర్యలు ఫలితాలిస్తున్నాయి.

అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటూ బైండోవర్ కేసులు నమోదు చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఫోర్ఫీచర్ చర్యలు అమలు చేశారు.

గతంలో సమస్యగా ఉన్న గంజా బాచ్ కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోవడం విశేషం.

పోలీసులు చేపట్టిన ముఖ్య చర్యలు:

• డ్రంకెన్ డ్రైవ్, బైక్ రేసింగ్, పేకాట, ఓపెన్ డ్రింకింగ్ కేసులపై కఠిన చర్యలు

• యువతకు కౌన్సిలింగ్ – ప్రమాదకర ప్రవర్తనలకు చెక్

• రోడ్డు భద్రతపై ప్రత్యేక చర్యలు

• గుజిరి షాపులపై అవగాహన – దొంగ సరుకుల నియంత్రణ

• గ్రామ సభల ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం

• పోక్సో, డ్రగ్స్, సైబర్ క్రైమ్‌పై అవగాహన కార్యక్రమాలు

• డీజేలు, అధిక శబ్దాలపై నియంత్రణ

• రైతులకు రోడ్డు భద్రతపై సూచనలు

ఈ కృషిని గుర్తించిన జిల్లా ఎస్పీ శ్రీ యస్. సతీష్ కుమార్ (ఐపీఎస్), జిల్లా క్రైమ్ మీటింగ్‌లో సోమందేపల్లి పోలీస్ స్టేషన్‌ను ప్రశంసిస్తూ ప్రశంస పత్రం మరియు నగదు బహుమతి అందజేశారు.

????️ ఎస్‌ఐ జి. సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ,

“ఈ గుర్తింపు మాకు మరింత బాధ్యతను పెంచింది. ప్రజల భద్రత కోసం మరింత కట్టుదిట్టంగా పనిచేస్తాం” అని తెలిపారు.

ప్రజలకు విజ్ఞప్తి:

చట్టాలను గౌరవిస్తూ, పోలీసులకు సహకరించి, నేరాలు మరియు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News