PRINT TIME: March 13, 2026 09:07 PM
సోమవారం ప్రజావాణి రద్దు జనగణన శిక్షణ కారణంగా నిర్ణయం – కలెక్టర్ అనురాగ్ జయంతి
సోమవారం ప్రజావాణి రద్దు జనగణన శిక్షణ కారణంగా నిర్ణయం – కలెక్టర్ అనురాగ్ జయంతి
March 13, 2026 06:53 PM
7 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 16న రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.
2027 జనగణన (Census-2027) తొలి దశలో భాగమైన హౌస్ లిస్టింగ్ & హౌసింగ్ సెంసస్ (HLO) కు సంబంధించి జిల్లా, చార్జ్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కావున మార్చి 16న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఉండదని, దరఖాస్తులు ఇవ్వడానికి కలెక్టరేట్కు రావొద్దని జిల్లా ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి