సంక్షేమ హాస్టళ్లలో ముఖ గుర్తింపు హాజరు విధానం. కలెక్టర్
సంక్షేమ హాస్టళ్లలో ముఖ గుర్తింపు హాజరు విధానం. కలెక్టర్
Editor Desk
జిల్లాలోని వివిధ సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు, సిబ్బందికి ముఖ గుర్తింపు ఆధారిత హాజరు విధానాన్ని అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.
శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 85 సంక్షేమ హాస్టళ్లలో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. నివాస పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు, మైనారిటీ హాస్టళ్లు, మోడల్ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు మరియు ఇతర హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది తప్పనిసరిగా ముఖ గుర్తింపు విధానం ద్వారా హాజరు నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ విధానం ద్వారా విద్యార్థుల హాజరు శాతం, సిబ్బంది హాజరును సరిగ్గా ధృవీకరించే అవకాశం ఉంటుందని, విద్యా సంస్థల నిర్వహణలో పారదర్శకత పెరుగుతుందని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి