సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో DCCB బ్యాంక్ ఏటీఎం సేవలు ప్రారంభం
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో DCCB బ్యాంక్ ఏటీఎం సేవలు ప్రారంభం
Reporter Sangameshwar Reddy
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (DCCB) శాఖలో ఏటీఎం సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు న్యాల్కల్ శాఖలో ఏర్పాటు చేసిన ఏటీఎంను పూజలు నిర్వహించి ప్రారంభించారు.న్యాల్కల్ ప్రాంతంలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండడంతో రైతులు పంటల సాగుకు అవసరమైన రుణాలు, వ్యవసాయానికి సంబంధించిన బ్యాంకింగ్ సేవలను ఈ శాఖ ద్వారా పొందుతున్నారు. రైతులకు పంట రుణాలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహాయం వంటి పలు సేవలను బ్యాంక్ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఏటీఎం సేవలు అందుబాటులోకి రావడంతో ఖాతాదారులు ఎప్పుడైనా సులభంగా నగదు ఉపసంహరణ చేసుకునే అవకాశం కలిగింది. ఈ సౌకర్యం వల్ల న్యాల్కల్ మండలంలోని రైతులు, వ్యాపారులు, ఖాతాదారులకు మరింత సౌలభ్యం కలుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ మేనేజర్ శ్రీనివాస్, ఏజీఎం వెంకటేశం, స్థానిక బ్రాంచ్ మేనేజర్ ధనుంజయ, అలాగే అధికార, విపక్ష పార్టీ శ్రేణులు భాస్కర్ రెడ్డి, సిద్ధిలింగయ్య స్వామి, జగన్నాథ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, రఫీయుద్దీన్ పాల్గొన్నారు.అదేవిధంగా స్థానిక బ్రాంచ్ సిబ్బంది బసవరాజ్, సంతోష్, ప్రశాంత్, మహమ్మద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి