సిరిపురం శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి దేవస్థానంలో బొడ్రాయి పదో వార్షికోత్సవం
సిరిపురం శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి దేవస్థానంలో బొడ్రాయి పదో వార్షికోత్సవం
Editor Desk
సిరిపురం గ్రామంలోని శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి దేవస్థానంలో బొడ్రాయి పదో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, నవగ్రహ పూజ, మహాన్యాస రుద్రాభిషేకం వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ మూడు దొడ్ల అనూష రమేష్, శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ రాపోలు రమేష్, శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ అప్పం రామేశ్వరం, మాజీ ఎంపిటిసి బడుగు రమేష్, పద్మశాలి సంఘం అధ్యక్షులు జెల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు.
అలాగే ఆలయ ధర్మకర్తలు బలుగూరి లింగస్వామి, కొంగరి జంగయ్య, సింగం నరసింహ, సంగిశెట్టి గణేష్, దంతూరి యాదగిరి, మామిడి చందన, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు పున్న వెంకటేశం, గాదె యాదయ్య, సంగిశెట్టి మహేష్, గుంటొజు కృష్ణమాచారి, కంకల అర్చన, పగుడాల లక్ష్మి, గాదె శంకరయ్య, జెల్లా సూర్యకళతో పాటు ఇతర నాయకులు అప్పం గోయల్, పున్న అమరేందర్, జెల్లా శ్రీనాథం, కొంగరి బాలరాజు, ఎలె నరసింహ, జెల్లా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఆలయ ప్రధాన అర్చకులు అప్పం రాములు, పృథ్వీరాజు గోపాలచార్యులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి