సిపిఐ శతాబ్ది జాతీయ బహిరంగ సభను విజయవంతం చేయండి: శ్రావణ్ కుమార్ పిలుపు
సిపిఐ శతాబ్ది జాతీయ బహిరంగ సభను విజయవంతం చేయండి: శ్రావణ్ కుమార్ పిలుపు
Editor Desk
చిట్యాల స్థానికం ప్రతినిధి ప్రశాంత్
సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జనవరి 18న ఖమ్మం పట్టణంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు.నేడు గుండ్రాంపల్లి గ్రామంలో నిర్వహించిన సిపిఐ గుండ్రాంపల్లి గ్రామ శాఖ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో సిపిఐ శతాబ్ద కాలంగా కార్మికులు, రైతులు, విద్యార్థులు, మహిళల హక్కుల కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించిందని గుర్తు చేశారు. వెట్టి చాకిరి నిర్మూలనతో పాటు కార్మికులు–కర్షకులను దోపిడీ నుంచి విముక్తి చేయడమే లక్ష్యంగా రాజీలేని పోరాటాలను సిపిఐ కొనసాగించిందన్నారు.శతాబ్ద కాలంలో ఎన్నో త్యాగాలు, అమరవీరుల రక్త తర్పణంతో అనేక విజయాలను సాధించిన సిపిఐ, భారతదేశ రాజకీయ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలో నిర్వహించే సిపిఐ శతాబ్ది జాతీయ ఉత్సవాల ముగింపు బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు జిల్లా యాదయ్య, బోడిగే సైదులు, గ్రామ శాఖ కార్యదర్శి జిల్లా సత్యం, సీనియర్ నాయకులు బోడిగే బక్కశెట్టి, రత్నం లింగస్వామి, పానుగుల శివ, సగాల అశోక్, బెదరకోట సైదులు, బొబ్బల శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి