Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యోగ కార్యక్రమంలో పాల్గొన్న సత్యసాయి జిల్లా అధికారులు ప్రజా పాలన వేదికగా రోడ్డు భద్రత సందేశం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 04:12 PM

సిపిఐ శతాబ్ది జాతీయ బహిరంగ సభను విజయవంతం చేయండి: శ్రావణ్ కుమార్ పిలుపు

సిపిఐ శతాబ్ది జాతీయ బహిరంగ సభను విజయవంతం చేయండి: శ్రావణ్ కుమార్ పిలుపు

సిపిఐ శతాబ్ది జాతీయ బహిరంగ సభను విజయవంతం చేయండి: శ్రావణ్ కుమార్ పిలుపు
January 11, 2026 05:07 PM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల స్థానికం ప్రతినిధి ప్రశాంత్

సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జనవరి 18న ఖమ్మం పట్టణంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు.నేడు గుండ్రాంపల్లి గ్రామంలో నిర్వహించిన సిపిఐ గుండ్రాంపల్లి గ్రామ శాఖ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో సిపిఐ శతాబ్ద కాలంగా కార్మికులు, రైతులు, విద్యార్థులు, మహిళల హక్కుల కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించిందని గుర్తు చేశారు. వెట్టి చాకిరి నిర్మూలనతో పాటు కార్మికులు–కర్షకులను దోపిడీ నుంచి విముక్తి చేయడమే లక్ష్యంగా రాజీలేని పోరాటాలను సిపిఐ కొనసాగించిందన్నారు.శతాబ్ద కాలంలో ఎన్నో త్యాగాలు, అమరవీరుల రక్త తర్పణంతో అనేక విజయాలను సాధించిన సిపిఐ, భారతదేశ రాజకీయ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలో నిర్వహించే సిపిఐ శతాబ్ది జాతీయ ఉత్సవాల ముగింపు బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు జిల్లా యాదయ్య, బోడిగే సైదులు, గ్రామ శాఖ కార్యదర్శి జిల్లా సత్యం, సీనియర్ నాయకులు బోడిగే బక్కశెట్టి, రత్నం లింగస్వామి, పానుగుల శివ, సగాల అశోక్, బెదరకోట సైదులు, బొబ్బల శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News