సింగరేణి వాంబే కాలనీ లో పని అంటేనే భయం… జీహెచ్ఎంసీ కార్మికుల ఆవేదన
సింగరేణి వాంబే కాలనీ లో పని అంటేనే భయం… జీహెచ్ఎంసీ కార్మికుల ఆవేదన
RAPOLU LINGASWAMY
యాకత్ పుర నియోజకవర్గం పరిధిలోని సింగరేణి కాలనీ
సింగరేణి వాంబే కాలనీ పరిధిలో పని చేస్తున్న జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుల పరిస్థితి రోజురోజుకీ దారుణంగా మారుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పని చేయాలంటేనే వణుకు పుడుతోంది అంటూ సర్కిల్-7కు చెందిన కార్మికులు మెట్రో ఉదయం మీడియా ముందుకు వచ్చి తమ బాధలను వెల్లగక్కారు. తమకు కనీస భద్రత లేకుండా పోయిందని, అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని వారు ఆరోపించారు.
గతంలో సింగరేణి వాంబే కాలనీ బ్లాక్ నంబర్లు 32, 36 మధ్యలో విధులు నిర్వహిస్తున్న మహేందర్ అనే కార్మికుడిపై భవనం పై నుంచి మద్యం బాటిల్ పడిన ఘటన కలకలం రేపింది. సహచర సిబ్బంది వెంటనే స్పందించి అతన్ని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనతో అక్కడ పని చేసే కార్మికులలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
ప్రతి రోజు చెత్త సేకరణకు వెళ్లే సమయంలో పై నుంచి ఎప్పుడు ఏమి పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మద్యం బాటిళ్లు, చెత్త సంచులు, కొబ్బరి బొండాలు వంటి వస్తువులు నిర్లక్ష్యంగా పడేస్తుండటంతో తమ ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తాజాగా మంగళవారం ఉదయం బ్లాక్ నెంబర్ 55వద్ద విధులు నిర్వహిస్తున్న మహేందర్ అనే కార్మికుడిపైన పైనుండి ఆకస్మత్తుగా అన్నం, నీళ్లు, లతో మీద పడడం జరిగింది.ఒకవైపు స్థానికులు చెత్త తీసుకోవడం లేదని ఫిర్యాదులు చేస్తుండగా, మరోవైపు తమ భద్రతపై ఎవరూ దృష్టి పెట్టడం లేదని వారు వాపోతున్నారు.
ఎప్పుడు ఎక్కడ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితిలో పనిచేస్తున్నాం. మా సమస్యలను పట్టించుకునే నాథుడు లేడు అంటూ కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి వెంటనే భద్రతా చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని, లేకపోతే విధులను బహిష్కరించక తప్పదని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి