Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోధి స్కూల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం – ప్రజలకు చల్లని తాగునీటి సేవ సోమందేపల్లి మండలంలో కిశోరి వికాసం శిక్షణ డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 05, 2026 07:36 PM

సింగరేణి వాంబే కాలనీ లో పని అంటేనే భయం… జీహెచ్‌ఎంసీ కార్మికుల ఆవేదన

సింగరేణి వాంబే కాలనీ లో పని అంటేనే భయం… జీహెచ్‌ఎంసీ కార్మికుల ఆవేదన

సింగరేణి వాంబే కాలనీ లో పని అంటేనే భయం… జీహెచ్‌ఎంసీ కార్మికుల ఆవేదన
May 05, 2026 05:47 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

యాకత్ పుర నియోజకవర్గం పరిధిలోని సింగరేణి కాలనీ

సింగరేణి వాంబే కాలనీ పరిధిలో పని చేస్తున్న జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికుల పరిస్థితి రోజురోజుకీ దారుణంగా మారుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పని చేయాలంటేనే వణుకు పుడుతోంది అంటూ సర్కిల్-7కు చెందిన కార్మికులు మెట్రో ఉదయం మీడియా ముందుకు వచ్చి తమ బాధలను వెల్లగక్కారు. తమకు కనీస భద్రత లేకుండా పోయిందని, అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని వారు ఆరోపించారు.

గతంలో సింగరేణి వాంబే కాలనీ బ్లాక్ నంబర్లు 32, 36 మధ్యలో విధులు నిర్వహిస్తున్న మహేందర్ అనే కార్మికుడిపై భవనం పై నుంచి మద్యం బాటిల్ పడిన ఘటన కలకలం రేపింది. సహచర సిబ్బంది వెంటనే స్పందించి అతన్ని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనతో అక్కడ పని చేసే కార్మికులలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

ప్రతి రోజు చెత్త సేకరణకు వెళ్లే సమయంలో పై నుంచి ఎప్పుడు ఏమి పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మద్యం బాటిళ్లు, చెత్త సంచులు, కొబ్బరి బొండాలు వంటి వస్తువులు నిర్లక్ష్యంగా పడేస్తుండటంతో తమ ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తాజాగా మంగళవారం ఉదయం బ్లాక్ నెంబర్ 55వద్ద విధులు నిర్వహిస్తున్న మహేందర్ అనే కార్మికుడిపైన పైనుండి ఆకస్మత్తుగా అన్నం, నీళ్లు, లతో మీద పడడం జరిగింది.ఒకవైపు స్థానికులు చెత్త తీసుకోవడం లేదని ఫిర్యాదులు చేస్తుండగా, మరోవైపు తమ భద్రతపై ఎవరూ దృష్టి పెట్టడం లేదని వారు వాపోతున్నారు.

ఎప్పుడు ఎక్కడ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితిలో పనిచేస్తున్నాం. మా సమస్యలను పట్టించుకునే నాథుడు లేడు అంటూ కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి వెంటనే భద్రతా చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని, లేకపోతే విధులను బహిష్కరించక తప్పదని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News