Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాలిపోతున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ రాష్ట్ర సచివాలయం లో కన్ఫరెన్స్ లో సత్యసాయి జిల్లా ఎస్.పి, కలెక్టర్ పెనుకొండలో బీసీ విద్యార్థులకు వరం.. కొత్తగా 3 హాస్టళ్లు మంజూరు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 09, 2026 04:23 PM

శంకర్‌నగర్ కాలనీలో నూతన ఆర్చి ప్రారంభం కాలనీ అభివృద్ధికి సహకరించిన వారికి ఎమ్మెల్యే అభినందనలు

శంకర్‌నగర్ కాలనీలో నూతన ఆర్చి ప్రారంభం కాలనీ అభివృద్ధికి సహకరించిన వారికి ఎమ్మెల్యే అభినందనలు

శంకర్‌నగర్ కాలనీలో నూతన ఆర్చి ప్రారంభం కాలనీ అభివృద్ధికి సహకరించిన వారికి ఎమ్మెల్యే అభినందనలు
May 09, 2026 03:26 PM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

ఎల్ బీ నగర్ నియోజకవర్గం :హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని శంకర్‌నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన ఆర్చి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి ఆర్చిని ప్రారంభించి కాలనీవాసులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీ అభివృద్ధి కోసం ముందుకు వచ్చి ఆర్చి నిర్మాణానికి సహకరించిన నక్క శంకర్ గౌడ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. గతంలో కాలనీలో డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణ పనులు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ఎల్లప్పుడూ ముందుంటానని పేర్కొన్నారు. కాలనీలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో హయత్‌నగర్ డివిజన్ భారస పార్టీ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్ గౌడ్, సీనియర్ మహిళా నాయకురాలు సింగిరెడ్డి మల్లీశ్వరి రెడ్డి, జక్కిడి రఘువీర్ రెడ్డి, నక్క దర్శన్ గౌడ్, చంద్రారెడ్డి, రాంచంద్రరెడ్డి, కాలనీ గౌరవ అధ్యక్షుడు సుబ్బారెడ్డి, అధ్యక్షుడు రాజ్‌కుమార్, జనరల్ సెక్రటరీ జనార్దన్, నర్సిరెడ్డి, అంజయ్య, రాంరెడ్డి, సునీల్, సత్యనారాయణ, మల్లయ్య, మల్లేశం, రాజారామ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News