శంకర్నగర్ కాలనీలో నూతన ఆర్చి ప్రారంభం కాలనీ అభివృద్ధికి సహకరించిన వారికి ఎమ్మెల్యే అభినందనలు
శంకర్నగర్ కాలనీలో నూతన ఆర్చి ప్రారంభం కాలనీ అభివృద్ధికి సహకరించిన వారికి ఎమ్మెల్యే అభినందనలు
RAPOLU LINGASWAMY
ఎల్ బీ నగర్ నియోజకవర్గం :హయత్నగర్ డివిజన్ పరిధిలోని శంకర్నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన ఆర్చి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి ఆర్చిని ప్రారంభించి కాలనీవాసులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీ అభివృద్ధి కోసం ముందుకు వచ్చి ఆర్చి నిర్మాణానికి సహకరించిన నక్క శంకర్ గౌడ్ను ప్రత్యేకంగా అభినందించారు. గతంలో కాలనీలో డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణ పనులు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ఎల్లప్పుడూ ముందుంటానని పేర్కొన్నారు. కాలనీలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో హయత్నగర్ డివిజన్ భారస పార్టీ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్ గౌడ్, సీనియర్ మహిళా నాయకురాలు సింగిరెడ్డి మల్లీశ్వరి రెడ్డి, జక్కిడి రఘువీర్ రెడ్డి, నక్క దర్శన్ గౌడ్, చంద్రారెడ్డి, రాంచంద్రరెడ్డి, కాలనీ గౌరవ అధ్యక్షుడు సుబ్బారెడ్డి, అధ్యక్షుడు రాజ్కుమార్, జనరల్ సెక్రటరీ జనార్దన్, నర్సిరెడ్డి, అంజయ్య, రాంరెడ్డి, సునీల్, సత్యనారాయణ, మల్లయ్య, మల్లేశం, రాజారామ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి