ఇంద్రపాలనగరం: గ్రామ ప్రజలకు ఉపయోగపడేలా శితిలావస్థకు చేరుకున్న స్వర్గపురి రథాన్ని పునరుద్ధరించి మళ్లీ వినియోగంలోకి తీసుకొచ్చారు. ఈర్లపల్లి (శివగల్ల) నర్సింహా గారి జ్ఞాపకార్థంగా వారి కుమారుడు శివగల్ల శ్రీనివాస్ ఏడేళ్ల క్రితం ఇంద్రపాలనగరానికి స్వర్గపురి రథాన్ని అందజేశారు.
అయితే గత రెండేళ్లుగా రథం శితిలావస్థకు చేరుకుంది. గ్రామ ప్రజల సౌకర్యార్థం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, దాత శ్రీనివాస్ చొరవతో సుమారు రూ.1.20 లక్షల వ్యయంతో రథాన్ని మరమ్మతులు చేయించి మళ్లీ వినియోగంలోకి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా గ్రామం మరియు పరిసర ప్రాంతాల ప్రజలు నిర్వహణ ఖర్చులు చెల్లించి రథాన్ని వినియోగించుకోవచ్చని గ్రామ పెద్దలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి