శిఖం భూములపై కబ్జాల కలకలం..! నీర్నేముల గ్రామస్తుల ఫిర్యాదుతో కలెక్టర్ స్పందన.
శిఖం భూములపై కబ్జాల కలకలం..! నీర్నేముల గ్రామస్తుల ఫిర్యాదుతో కలెక్టర్ స్పందన.
Editor Desk
తహసీల్దార్, ఇరిగేషన్ అధికారులకు విచారణ ఆదేశాలు.
రామన్నపేట మండలంలోని నీర్నేముల గ్రామంలోని ప్రభుత్వ, చెరువు గర్భం, కుంటల శిఖం భూములపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలను అరికట్టి, వెంటనే సర్వే నిర్వహించి కబ్జాలను తొలగించాలని కోరుతూ గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో గ్రామ బాధ్యతాయుత పౌరులు, గ్రామస్తుల తరఫున వినతిపత్రాన్ని సమర్పించారు.
గ్రామంలో గతంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభ అనంతరం తహసీల్దార్ Endt.No.D/470/2026 ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో ఉమ్మడి సర్వే చేపట్టకపోవడం, ఆక్రమణల తొలగింపుపై చర్యలు లేకపోవడంతో అక్రమార్కులు చెరువు శిఖం భూములను ఆక్రమించి సాగు చేస్తున్నారని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై గతంలో దినపత్రికల్లో కథనాలు వచ్చినా అధికారులు స్పందించలేదని పేర్కొన్నారు.
ఫిర్యాదుపై స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని తహసీల్దార్, ఇరిగేషన్ ఈఈ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, చెరువు శిఖం భూములు ప్రజల ఉమ్మడి ఆస్తి అని, వాటిని పరిరక్షించడం అధికారుల బాధ్యత అని గ్రామస్తులు పేర్కొన్నారు. భవిష్యత్ తరాల ప్రయోజనాల దృష్ట్యా వెంటనే సర్వే నిర్వహించి ఆక్రమణలను తొలగించాలని వారు విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి