శ్రీవాణి విద్యాలయ వార్షికోత్సవం. ఘనంగా విద్యార్థుల ప్రతిభకు వేదికగా వేడుకలు
శ్రీవాణి విద్యాలయ వార్షికోత్సవం. ఘనంగా విద్యార్థుల ప్రతిభకు వేదికగా వేడుకలు
Editor Desk
యాదాద్రి-భువనగిరి: భువనగిరి పట్టణంలోని శ్రీవాణి విద్యాలయం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 2వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీవాణి విద్యా సమితి అధ్యక్షులు పులిమామిడి బాలకృష్ణా రెడ్డి, ఎంపాలా బుచ్చి రెడ్డి, బోగు మాధవరెడ్డి, పులుగం నర్సింహా రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీవాణి విద్యా సంస్థ స్వచ్ఛంద సంస్థగా పనిచేస్తోందని, లాభాపేక్ష లేకుండా సభ్యులు సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. నాణ్యమైన విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ దృష్ట్యా శ్రీవాణి విద్యాలయంలో చేర్పించాలని సూచించారు.
శ్రీవాణి విద్యాలయం ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా ఎదుగుతోందని, ఇక్కడ చదివే విద్యార్థులు ఉన్నత స్థానాలను అధిరోహించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారని అభిప్రాయపడ్డారు. పాఠశాల అభివృద్ధికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను జిల్లా స్థాయిలో నిర్వహించాలని నిర్వాహకులు తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి