Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భువనగిరి చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకారం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 21, 2026 06:46 AM

శాలిగౌరారంలో ఆర్ఐపై అవినీతి ఆరోపణల దుమారం

శాలిగౌరారంలో ఆర్ఐపై అవినీతి ఆరోపణల దుమారం

శాలిగౌరారంలో ఆర్ఐపై అవినీతి ఆరోపణల దుమారం
July 20, 2026 01:15 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

లంచాలు తీసుకుని రికార్డులు మారుస్తున్నాడంటూ రైతుల ఆగ్రహం.. సస్పెన్షన్‌కు డిమాండ్.


శాలిగౌరారం, జూలై 20:

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్ఐ)గా విధులు నిర్వహిస్తున్న రఫీపై అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సర్వేలు నిర్వహించకుండానే డబ్బులు వసూలు చేస్తూ భూ రికార్డుల్లో మార్పులు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.ఈ నెల 14వ తేదీన మండలంలోని వద్దిపాముల, తక్కెళ్లపాడు గ్రామాలకు చెందిన రైతులు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆర్ఐ రఫీని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ సమస్యలను వివరిస్తూ ఆర్డీవోతో పాటు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు.

రైతుల ఆరోపణల ప్రకారం, భూ సర్వేలు చేయకుండానే రికార్డులు మార్చేందుకు డబ్బులు తీసుకుంటున్నారని, ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఇన్‌కమ్ సర్టిఫికెట్) కోసం రూ.500, కళ్యాణలక్ష్మి దరఖాస్తుల కోసం రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను పొందేందుకు ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రెవెన్యూ శాఖపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఈ ఆరోపణలపై సంబంధిత ఆర్ఐ రఫీ లేదా రెవెన్యూ శాఖ అధికారుల నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. రైతుల ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News