సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్తు: మంత్రి సవిత
సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్తు: మంత్రి సవిత
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో సీఎం N.నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించగా, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆయన నాయకత్వాన్ని కొనియాడారు. రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబుతోనే సురక్షితమని, ఆయన విజనరీ పాలనతో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రగామిగా నిలుస్తోందని పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో అవినీతి మచ్చలేని నాయకుడిగా చంద్రబాబు నిలిచారని, ఆయన బ్రాండ్ ఇమేజ్ వల్ల రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు.
రాయలసీమ అభివృద్ధిలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, హార్టికల్చర్ మరియు డ్రోన్ రంగాల అభివృద్ధితో ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని మంత్రి సవిత వివరించారు. పెనుకొండలో కియా పరిశ్రమ స్థాపనతో వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించారని గుర్తుచేశారు.
వైసీపీ బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేసిన మంత్రి, తమ ప్రభుత్వం ఎప్పుడూ అవినీతి, అక్రమాలకు పాల్పడలేదన్నారు. జగన్ పాలనను ప్రజలు తిరస్కరించారని, ఆయన రాజకీయ అధ్యాయం ముగిసిందని వ్యాఖ్యానించారు. ప్రజలు మళ్లీ మళ్లీ చంద్రబాబునే ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా పెనుకొండలో 76 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించగా, అనంతరం కియా పరిశ్రమ వద్ద 76 కేజీల కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి