Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 04:12 AM

సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్తు: మంత్రి సవిత

సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్తు: మంత్రి సవిత

సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్తు: మంత్రి సవిత
April 20, 2026 07:33 PM 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో సీఎం N.నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించగా, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆయన నాయకత్వాన్ని కొనియాడారు. రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబుతోనే సురక్షితమని, ఆయన విజనరీ పాలనతో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రగామిగా నిలుస్తోందని పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో అవినీతి మచ్చలేని నాయకుడిగా చంద్రబాబు నిలిచారని, ఆయన బ్రాండ్ ఇమేజ్ వల్ల రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు.


రాయలసీమ అభివృద్ధిలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, హార్టికల్చర్ మరియు డ్రోన్ రంగాల అభివృద్ధితో ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని మంత్రి సవిత వివరించారు. పెనుకొండలో కియా పరిశ్రమ స్థాపనతో వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించారని గుర్తుచేశారు.


వైసీపీ బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేసిన మంత్రి, తమ ప్రభుత్వం ఎప్పుడూ అవినీతి, అక్రమాలకు పాల్పడలేదన్నారు. జగన్ పాలనను ప్రజలు తిరస్కరించారని, ఆయన రాజకీయ అధ్యాయం ముగిసిందని వ్యాఖ్యానించారు. ప్రజలు మళ్లీ మళ్లీ చంద్రబాబునే ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని తెలిపారు.


ఈ సందర్భంగా పెనుకొండలో 76 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించగా, అనంతరం కియా పరిశ్రమ వద్ద 76 కేజీల కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News