PRINT TIME: February 24, 2026 12:40 AM
సాయిపేట్ గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ –క్రీడాకారులకు బహుమతులు
సాయిపేట్ గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ –క్రీడాకారులకు బహుమతులు
January 16, 2026 09:01 PM
18 Views
స్థానికం ప్రతినిధి :
Sangareddy & Manoor
Sthanikam District Staff Reporter krishna
సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:వట్ పల్లి మండలంలోని సాయిపేట్ గ్రామంలో కార్చెల్ల సంగమేశ్వర్, నల్లవల్లి అడివప్ప, ఆలూరి వీరన్న, కాలాలి యాదగౌడ్ ఆధ్వర్యంలో విలేజ్ వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “యువత క్రీడల్లో రాణించి అద్భుతమైన ప్రతిభ చూపితే గ్రామానికి మంచి గుర్తింపు, పేరు, ప్రఖ్యాతులు వస్తాయి మరియు ముందతరం యువతకు దిశానిర్దేశం అవుతుందని అన్నారు. గ్రామ సర్పంచ్ ఆలూరి సంతోష– ఆంజనేయులు క్రీడాకారులను అభినందించి టాస్ వేసి తొలి ఆటను సర్వీస్ చేసి యువకుల్లో ఉత్సాహాన్ని నింపారు. మొత్తం 5 జట్లు పోటీకి ఎంటర్ అయ్యాయి. ప్రథమ బహుమతిగా రూ.6000, రెండవ బహుమతిగా రూ.4000 క్రీడాకారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, క్రీడాకారులు, పెద్దలతో పాటు ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి