స్వచ్ఛంద సేవలతో దాహార్తికి చల్లని నివాళి
స్వచ్ఛంద సేవలతో దాహార్తికి చల్లని నివాళి
Editor Desk
భువనగిరి,
స్వచ్ఛంద సంస్థల సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో మేనేజర్ సీహెచ్ మురళీకృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం భువనగిరి కొత్త బస్టాండ్ ఆవరణలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘చలివేంద్రం’ను ఆయన స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ శ్రీలతతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు గత కొన్ని ఏళ్లుగా వేసవి కాలంలో బస్టాండ్ వద్ద చలివేంద్రాన్ని నిర్వహిస్తూ ప్రయాణికుల దాహార్తిని తీర్చడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు సోమ కృష్ణమూర్తి, కస్తూరి లక్ష్మీనారాయణ, సోమ సరస్వతి, వంగపల్లి అంజయ్య స్వామి, కుక్కడపు చంద్రశేఖర్, చింతపండు రాజు, పసుపునూరి వాణి, బుస్సా కృష్ణవేణి, గట్ఠు రమాదేవి పాల్గొన్నారు. అలాగే సామాజిక కార్యకర్తలు కొడారి వెంకటేష్, మాటూరి బాలేశ్వర్, జంపాల అంజయ్య, ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, సిబ్బంది వెంకటయ్య, శ్రీధర్, గణేష్ తదితరులు హాజరయ్యారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి