Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:22 PM

స్వచ్ఛంద సేవలతో దాహార్తికి చల్లని నివాళి

స్వచ్ఛంద సేవలతో దాహార్తికి చల్లని నివాళి

స్వచ్ఛంద సేవలతో దాహార్తికి చల్లని నివాళి
20-04-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,

స్వచ్ఛంద సంస్థల సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో మేనేజర్ సీహెచ్ మురళీకృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం భువనగిరి కొత్త బస్టాండ్ ఆవరణలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘చలివేంద్రం’ను ఆయన స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ శ్రీలతతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు గత కొన్ని ఏళ్లుగా వేసవి కాలంలో బస్టాండ్ వద్ద చలివేంద్రాన్ని నిర్వహిస్తూ ప్రయాణికుల దాహార్తిని తీర్చడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు సోమ కృష్ణమూర్తి, కస్తూరి లక్ష్మీనారాయణ, సోమ సరస్వతి, వంగపల్లి అంజయ్య స్వామి, కుక్కడపు చంద్రశేఖర్, చింతపండు రాజు, పసుపునూరి వాణి, బుస్సా కృష్ణవేణి, గట్ఠు రమాదేవి పాల్గొన్నారు. అలాగే సామాజిక కార్యకర్తలు కొడారి వెంకటేష్, మాటూరి బాలేశ్వర్, జంపాల అంజయ్య, ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, సిబ్బంది వెంకటయ్య, శ్రీధర్, గణేష్ తదితరులు హాజరయ్యారు.

Sthanikam

స్వచ్ఛంద సేవలతో దాహార్తికి చల్లని నివాళి

Article Image

భువనగిరి,

స్వచ్ఛంద సంస్థల సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో మేనేజర్ సీహెచ్ మురళీకృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం భువనగిరి కొత్త బస్టాండ్ ఆవరణలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘చలివేంద్రం’ను ఆయన స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ శ్రీలతతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు గత కొన్ని ఏళ్లుగా వేసవి కాలంలో బస్టాండ్ వద్ద చలివేంద్రాన్ని నిర్వహిస్తూ ప్రయాణికుల దాహార్తిని తీర్చడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు సోమ కృష్ణమూర్తి, కస్తూరి లక్ష్మీనారాయణ, సోమ సరస్వతి, వంగపల్లి అంజయ్య స్వామి, కుక్కడపు చంద్రశేఖర్, చింతపండు రాజు, పసుపునూరి వాణి, బుస్సా కృష్ణవేణి, గట్ఠు రమాదేవి పాల్గొన్నారు. అలాగే సామాజిక కార్యకర్తలు కొడారి వెంకటేష్, మాటూరి బాలేశ్వర్, జంపాల అంజయ్య, ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, సిబ్బంది వెంకటయ్య, శ్రీధర్, గణేష్ తదితరులు హాజరయ్యారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News