Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 08:11 AM

స్వచ్ఛ చౌటుప్పల్ లక్ష్యంగా 99 రోజుల ప్రణాళిక పురపాలక సంఘంలో ఘనంగా ప్రారంభం…

స్వచ్ఛ చౌటుప్పల్ లక్ష్యంగా 99 రోజుల ప్రణాళిక పురపాలక సంఘంలో ఘనంగా ప్రారంభం…

స్వచ్ఛ చౌటుప్పల్ లక్ష్యంగా 99 రోజుల ప్రణాళిక పురపాలక సంఘంలో ఘనంగా ప్రారంభం…
March 06, 2026 08:30 PM 213 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పట్టణ అభివృద్ధి, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక (ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక) ను చౌటుప్పల్ పురపాలక సంఘంలో శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మొగుదాల పావని ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. పట్టణాల సమగ్ర అభివృద్ధిలో ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని ఆమె తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రామిరెడ్డి కౌన్సిలర్లు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులతో పట్టణ పరిశుభ్రత, అభివృద్ధిపై ప్రతిజ్ఞ చేయించారు.చైర్‌పర్సన్ మొగుదాల పావని మాట్లాడుతూ అందరి సహకారంతో చౌటుప్పల్ పట్టణాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని, స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ‘స్వచ్ఛ చౌటుప్పల్’ లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు. వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత అని అన్నారు.ప్రతిజ్ఞ కార్యక్రమం అనంతరం తంగడపల్లి 5వ వార్డు బ్రహ్మంగారి గుడి సమీపంలోని రహదారులను శుభ్రం చేసి చెత్త కుప్పలను తొలగించారు. పట్టణ ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కమిషనర్ సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని, వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ జి.వెంకట రామిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు, పారిశుధ్య విభాగం అధికారులు, మున్సిపల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News