Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 02:25 AM

స్వచ్ఛ చౌటుప్పల్ లక్ష్యంగా 99 రోజుల ప్రణాళిక పురపాలక సంఘంలో ఘనంగా ప్రారంభం…

స్వచ్ఛ చౌటుప్పల్ లక్ష్యంగా 99 రోజుల ప్రణాళిక పురపాలక సంఘంలో ఘనంగా ప్రారంభం…

స్వచ్ఛ చౌటుప్పల్ లక్ష్యంగా 99 రోజుల ప్రణాళిక పురపాలక సంఘంలో ఘనంగా ప్రారంభం…
March 06, 2026 08:30 PM 219 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పట్టణ అభివృద్ధి, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక (ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక) ను చౌటుప్పల్ పురపాలక సంఘంలో శుక్రవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మొగుదాల పావని ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. పట్టణాల సమగ్ర అభివృద్ధిలో ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని ఆమె తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రామిరెడ్డి కౌన్సిలర్లు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులతో పట్టణ పరిశుభ్రత, అభివృద్ధిపై ప్రతిజ్ఞ చేయించారు.చైర్‌పర్సన్ మొగుదాల పావని మాట్లాడుతూ అందరి సహకారంతో చౌటుప్పల్ పట్టణాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని, స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ‘స్వచ్ఛ చౌటుప్పల్’ లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు. వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత అని అన్నారు.ప్రతిజ్ఞ కార్యక్రమం అనంతరం తంగడపల్లి 5వ వార్డు బ్రహ్మంగారి గుడి సమీపంలోని రహదారులను శుభ్రం చేసి చెత్త కుప్పలను తొలగించారు. పట్టణ ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కమిషనర్ సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని, వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ జి.వెంకట రామిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు, పారిశుధ్య విభాగం అధికారులు, మున్సిపల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News