Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:30 AM

సత్యసాయి చేనేతకు ప్రపంచ ఖ్యాతి

సత్యసాయి చేనేతకు ప్రపంచ ఖ్యాతి

సత్యసాయి చేనేతకు ప్రపంచ ఖ్యాతి
18-04-2026 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

ధర్మవరం,: ప్రపంచవ్యాప్తంగా సత్యసాయి జిల్లాకు చేనేత రంగంలో విశేష గుర్తింపు లభించిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. చైనా దేశంలోని బీజింగ్, గ్యాంగ్జూ నగరాల్లో నిర్వహించిన వసంతమేళా-2026లో ధర్మవరం చేనేత ప్రతిభను చాటిన జాతీయ అవార్డు గ్రహీత డిజైనర్ జూజారే నాగరాజును కలెక్టర్ ఘనంగా సత్కరించారు.

ధర్మవరం నుంచి చేనేత మగ్గాన్ని తీసుకెళ్లి, అక్కడ ప్రత్యక్షంగా ఏర్పాటు చేసి చైనా ప్రజలకు భారతీయ సంప్రదాయాన్ని పరిచయం చేయడం ద్వారా నాగరాజు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కలెక్టర్ ప్రశంసించారు. మరుగున పడుతున్న చేనేత పరిశ్రమను నాగరాజు వంటి కళాకారులు ముందుకు తీసుకెళ్తున్నారని, వారి కృషితో ధర్మవరం మరియు సత్యసాయి జిల్లా పేరు మరింత ఎత్తుకు చేరాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా నాగరాజు కంప్యూటర్ డిజైనింగ్ విధానం, డిజైన్ గ్రాఫ్‌లు, ప్రింటింగ్ ప్రక్రియల గురించి కలెక్టర్‌కు వివరించారు. అలాగే ధర్మవరం పట్టు చీరలు, పట్టు శాలువాల ప్రత్యేకతలను సమగ్రంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చేనేత అధ్యక్షుడు పరిసే సుధాకర్, కమతం కాటమయ్య, చేనేత అధికారులు సుబ్బానాయుడు, శీనా నాయక్, ధర్మవరం తహసీల్దారు, మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ శాఖ అధికారులు, చేనేత కార్మికుడు చిప్పల మార్కండేయ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సత్యసాయి చేనేతకు ప్రపంచ ఖ్యాతి

Article Image

ధర్మవరం,: ప్రపంచవ్యాప్తంగా సత్యసాయి జిల్లాకు చేనేత రంగంలో విశేష గుర్తింపు లభించిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. చైనా దేశంలోని బీజింగ్, గ్యాంగ్జూ నగరాల్లో నిర్వహించిన వసంతమేళా-2026లో ధర్మవరం చేనేత ప్రతిభను చాటిన జాతీయ అవార్డు గ్రహీత డిజైనర్ జూజారే నాగరాజును కలెక్టర్ ఘనంగా సత్కరించారు.

ధర్మవరం నుంచి చేనేత మగ్గాన్ని తీసుకెళ్లి, అక్కడ ప్రత్యక్షంగా ఏర్పాటు చేసి చైనా ప్రజలకు భారతీయ సంప్రదాయాన్ని పరిచయం చేయడం ద్వారా నాగరాజు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కలెక్టర్ ప్రశంసించారు. మరుగున పడుతున్న చేనేత పరిశ్రమను నాగరాజు వంటి కళాకారులు ముందుకు తీసుకెళ్తున్నారని, వారి కృషితో ధర్మవరం మరియు సత్యసాయి జిల్లా పేరు మరింత ఎత్తుకు చేరాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా నాగరాజు కంప్యూటర్ డిజైనింగ్ విధానం, డిజైన్ గ్రాఫ్‌లు, ప్రింటింగ్ ప్రక్రియల గురించి కలెక్టర్‌కు వివరించారు. అలాగే ధర్మవరం పట్టు చీరలు, పట్టు శాలువాల ప్రత్యేకతలను సమగ్రంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చేనేత అధ్యక్షుడు పరిసే సుధాకర్, కమతం కాటమయ్య, చేనేత అధికారులు సుబ్బానాయుడు, శీనా నాయక్, ధర్మవరం తహసీల్దారు, మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ శాఖ అధికారులు, చేనేత కార్మికుడు చిప్పల మార్కండేయ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News