Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆరెగూడెంలో ఉపాధి హామీ పనులకు శ్రీకారం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 11:08 AM

సత్యసాయి బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా సాయి కుమార్ ఎంపిక

సత్యసాయి బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా సాయి కుమార్ ఎంపిక

సత్యసాయి బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా సాయి కుమార్ ఎంపిక
March 06, 2026 02:25 AM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సత్యసాయి జిల్లా భారతీయ జనతా యువ మోర్చా (BJYM) జిల్లా కార్యదర్శిగా హిందూపురానికి చెందిన వీర శెట్టి సాయి కుమార్ ఎన్నికయ్యారు.

భారతీయ జనతా పార్టీ యువ మోర్చా విభాగంలో ఆయన గతంలో BJYM హిందూపురం పట్టణ ప్రధాన కార్యదర్శిగా, BJYM జిల్లా కోశాధికారిగా, BJYM జిల్లా కార్యదర్శిగా పలు బాధ్యతలు నిర్వహించారు. అప్పగించిన ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేశారు.

జిల్లా యువ నాయకుడు సాయికుమార్ గతంలో చేసిన సేవలను గుర్తించి, ప్రస్తుతం భారతీయ జనతా యువ మోర్చా శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శిగా నన్ను నియమించినందుకు జిల్లా పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు.

BJYM జిల్లా అధ్యక్షులు బిల్లు కుళ్లాయి యాదవ్ కు , రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ కు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె దేవానంద్ బిజెపి రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసులు కు , BJYM రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి కు, బిజెపి శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు జి.ఎం. శేఖర్ కు , BJYM రాష్ట్ర మాజీ అధ్యక్షులు మిట్టా వంశీ కి, బిజెపి రాష్ట్ర నాయకులు మేడికుర్తి హరి కు మరియు ఇందుకు సహకరించిన రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, హిందూపురం అసెంబ్లీ నాయకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు పేరు పేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

పార్టీ విస్తరణకు, పార్టీలో యువశక్తిని పెంపొందించేందుకు, అలాగే పార్టీ చేపట్టబోయే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News