Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 07, 2026 08:10 PM

సత్తి లింగమ్మకు నివాళులు అర్పించిన మల్లి బాబు యాదవ్

సత్తి లింగమ్మకు నివాళులు అర్పించిన మల్లి బాబు యాదవ్

సత్తి లింగమ్మకు నివాళులు అర్పించిన మల్లి బాబు యాదవ్
March 07, 2026 06:46 PM 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

కామేపల్లి: మండలంలోని రాయిగూడెం గ్రామానికి చెందిన సత్తి లింగమ్మ వృద్ధాప్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. శనివారం నిర్వహించిన దశదిన కార్యక్రమానికి మాజీ జెడ్పీటీసీ, డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ హాజరై చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సత్తి లింగమ్మ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కన్నతల్లి కోల్పోవడం ఆ కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ ఇటువంటి సమయంలో ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు మనోధైర్యం నూరిపోశారు.

ఈ కార్యక్రమంలో రుకి తండా గ్రామపంచాయతీ సర్పంచ్ గుగులోతు రమాదేవి, గుగులోతు రవి, ఉపసర్పంచ్ పరిమిశెట్టి సాంబయ్య, సత్తి సైదులు, సత్తి లింగయ్య, సత్తి నరసయ్య, సత్తి చిట్టిబాబు, చిన్నబోయిన సత్యం, ఉబ్బని రాములు, చిన్నబోయిన రామకృష్ణ, గుగులోతు మంగ, బాస్, శివుడు, గుగులోతు కిషన్, కానబోయిన బిక్షం, బాధావత్ నాగరాజు, పాటిబండ్ల ప్రసాదు, ఓరుగంటి యుగంధర్, ఒట్టే బాబు, ఒట్టే కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News