సర్వ శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలి; మల్లపాక రవీందర్
సర్వ శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలి; మల్లపాక రవీందర్
Bandi Kiran Kumar
తుంగతుర్తి;
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టి ఎస్ యు టి ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం తుంగతుర్తి మండల పరిధిలోని కేజీవీబీ పాఠశాల మరియు ఎంఆర్ సి లో పనిచేస్తున్న సర్వ శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసంపోస్ట్ కార్డు ప్రారంభించారు. టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి& తుంగతుర్తి మండల అధ్యక్షుడు మల్లెపాక రవీందర్ మాట్లాడుతూ...
కేజీబీవీ,యుఆర్ఎస్ మరియు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి పోస్ట్ కార్డుల ద్వారా విన్నవించడం కోసం ఈ పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీసుకోవడం జరిగింది అన్నారు. కేజీబీవీ/ఎస్/ ఉద్యోగ,ఉపాధ్యాయులకు మరియు నాన్ టీచింగ్ సిబ్బందికి మినిమం టైమ్ స్కేల్ వర్తింప చేయాలని, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగాసెలవు సౌకర్యాలు కల్పించాలని, వార్షిక ఇంక్రిమెంట్, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని,కేర్ టేకర్లను నియమించాలని,సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలని మొదలగు డిమాండ్స్ పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి పోస్ట్ కార్డు ద్వారా సమస్యలు విన్నవించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో CRP లు చిత్తలూరి రాజేష్,దార సరిత, కాసనబోయినమల్లయ్య, దేశపంగు జ్యోతి,ఐఈఆర్పీ గుండగానిఉపేందర్, మెసెంజర్ మద్దికుంట్లవెంకన్న,పిటిఐలుమద్దికుంట్ల శ్రీనివాస్,కోటప్రశాంతి,రమ,కిన్నెర కిరణ్ బాబు, కేజీబీవీ సిబ్బంది సిఆర్ టిలు సాల్మ,దుర్గభవాని,రమాదేవి పార్ట్ టైంఇన్స్ట్రక్టర్స్ రేణుక, మై భూమి, వెంకటలక్ష్మి గౌస్య, ఉమామహేశ్వరి, సమతలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి