సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి ముందడుగు… దోమల నివారణ చర్యలు
సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి ముందడుగు… దోమల నివారణ చర్యలు
Editor Desk
యాదాద్రి భువనగిరి,: గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నీర్నంల గ్రామంలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రామంలో విపరీతంగా పెరిగిన దోమల సమస్యను పరిష్కరించేందుకు సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి ముందడుగు వేశారు.
ప్రజల విజ్ఞప్తి మేరకు 15 రోజుల క్రితం కొత్త దోమల నివారణ యంత్రాన్ని కొనుగోలు చేసి, సోమవారం గ్రామపంచాయతీ సిబ్బంది సహకారంతో ప్రతి వార్డులో తిరుగుతూ దోమల మందు పిచికారీ నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధితో పాటు ప్రజా ఆరోగ్యాన్ని కాపాడటం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామంలో పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ కోసం మరిన్ని చర్యలు చేపడతామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆవుల శ్రీశైలం యాదవ్, వార్డు సభ్యులు చిన్నపాక రమేష్, పెరుమాండ్ల నవీన్, ముత్యాల కిషన్, నాగొండ మల్లికార్జున్, నాగటి ఉపేందర్, బోయిన ఐలమ్మ, నోముల ఉమారాణి, కట్ట తనుశ్రీ, నాగొండ రవళి తదితరులు పాల్గొన్నారు.
గ్రామంలో దోమల నివారణ చర్యలు చేపట్టినందుకు సర్పంచ్ మరియు పాలకవర్గానికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి