Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శిథిలావస్థకు చేరిన బాలికల హాస్టల్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:41 PM

సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి ముందడుగు… దోమల నివారణ చర్యలు

సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి ముందడుగు… దోమల నివారణ చర్యలు

సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి ముందడుగు… దోమల నివారణ చర్యలు
30-03-2026 157 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి,: గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నీర్నంల గ్రామంలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రామంలో విపరీతంగా పెరిగిన దోమల సమస్యను పరిష్కరించేందుకు సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి ముందడుగు వేశారు.

ప్రజల విజ్ఞప్తి మేరకు 15 రోజుల క్రితం కొత్త దోమల నివారణ యంత్రాన్ని కొనుగోలు చేసి, సోమవారం గ్రామపంచాయతీ సిబ్బంది సహకారంతో ప్రతి వార్డులో తిరుగుతూ దోమల మందు పిచికారీ నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధితో పాటు ప్రజా ఆరోగ్యాన్ని కాపాడటం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామంలో పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ కోసం మరిన్ని చర్యలు చేపడతామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆవుల శ్రీశైలం యాదవ్, వార్డు సభ్యులు చిన్నపాక రమేష్, పెరుమాండ్ల నవీన్, ముత్యాల కిషన్, నాగొండ మల్లికార్జున్, నాగటి ఉపేందర్, బోయిన ఐలమ్మ, నోముల ఉమారాణి, కట్ట తనుశ్రీ, నాగొండ రవళి తదితరులు పాల్గొన్నారు.

గ్రామంలో దోమల నివారణ చర్యలు చేపట్టినందుకు సర్పంచ్ మరియు పాలకవర్గానికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి ముందడుగు… దోమల నివారణ చర్యలు

Article Image

యాదాద్రి భువనగిరి,: గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నీర్నంల గ్రామంలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రామంలో విపరీతంగా పెరిగిన దోమల సమస్యను పరిష్కరించేందుకు సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి ముందడుగు వేశారు.

ప్రజల విజ్ఞప్తి మేరకు 15 రోజుల క్రితం కొత్త దోమల నివారణ యంత్రాన్ని కొనుగోలు చేసి, సోమవారం గ్రామపంచాయతీ సిబ్బంది సహకారంతో ప్రతి వార్డులో తిరుగుతూ దోమల మందు పిచికారీ నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధితో పాటు ప్రజా ఆరోగ్యాన్ని కాపాడటం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామంలో పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ కోసం మరిన్ని చర్యలు చేపడతామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆవుల శ్రీశైలం యాదవ్, వార్డు సభ్యులు చిన్నపాక రమేష్, పెరుమాండ్ల నవీన్, ముత్యాల కిషన్, నాగొండ మల్లికార్జున్, నాగటి ఉపేందర్, బోయిన ఐలమ్మ, నోముల ఉమారాణి, కట్ట తనుశ్రీ, నాగొండ రవళి తదితరులు పాల్గొన్నారు.

గ్రామంలో దోమల నివారణ చర్యలు చేపట్టినందుకు సర్పంచ్ మరియు పాలకవర్గానికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News