Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేటకు ప్రత్యేక నియోజకవర్గం సాధనపై ఉద్యమం ఉధృతం. నకరికంటి నరేష్ వాట్సాప్‌లో భూ నమోదు సేవలు ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 06:22 PM

సాంప్రదాయ రుచులతో నాణ్యతకు ప్రాధాన్యం

సాంప్రదాయ రుచులతో నాణ్యతకు ప్రాధాన్యం

సాంప్రదాయ రుచులతో నాణ్యతకు ప్రాధాన్యం
April 12, 2026 04:54 PM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

ఎల్బీ నగర్ హస్తినాపురం లో నూతనంగా ఏర్పాటు చేసిన నాగి రెడ్డి స్వీట్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి తాజా మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై షాప్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మొద్దు లచ్చి రెడ్డి మాట్లాడుతూ, సంప్రదాయ రుచులతో, నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ స్వీట్ షాప్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలకు రుచికరమైన, నాణ్యమైన స్వీట్లు అందించాలని యజమానులకు సూచించారు. వ్యాపారంలో నమ్మకం, నాణ్యత ఉంటే ప్రజల ఆదరణ తప్పకుండా లభిస్తుందని పేర్కొన్నారు.

అలాగే, వనస్థలిపురం ప్రాంతంలో ఇటువంటి వ్యాపార సంస్థలు ప్రారంభం కావడం స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూడా దోహదపడుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్వీట్ షాప్ యజమాని నాగేశ్వర్ రెడ్డి, పవన్ రెడ్డి, పార్టీ డివిజన్ ఉపాధ్యక్షులు పవన్ రెడ్డి, బీజేవైఎం అధ్యక్షులు సురేష్ కుమార్, నాయకులు సాయి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News