సాంప్రదాయ రుచులతో నాణ్యతకు ప్రాధాన్యం
సాంప్రదాయ రుచులతో నాణ్యతకు ప్రాధాన్యం
RAPOLU LINGASWAMY
ఎల్బీ నగర్ హస్తినాపురం లో నూతనంగా ఏర్పాటు చేసిన నాగి రెడ్డి స్వీట్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి తాజా మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై షాప్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మొద్దు లచ్చి రెడ్డి మాట్లాడుతూ, సంప్రదాయ రుచులతో, నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ స్వీట్ షాప్ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలకు రుచికరమైన, నాణ్యమైన స్వీట్లు అందించాలని యజమానులకు సూచించారు. వ్యాపారంలో నమ్మకం, నాణ్యత ఉంటే ప్రజల ఆదరణ తప్పకుండా లభిస్తుందని పేర్కొన్నారు.
అలాగే, వనస్థలిపురం ప్రాంతంలో ఇటువంటి వ్యాపార సంస్థలు ప్రారంభం కావడం స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూడా దోహదపడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్వీట్ షాప్ యజమాని నాగేశ్వర్ రెడ్డి, పవన్ రెడ్డి, పార్టీ డివిజన్ ఉపాధ్యక్షులు పవన్ రెడ్డి, బీజేవైఎం అధ్యక్షులు సురేష్ కుమార్, నాయకులు సాయి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి