Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ భూమిపై మట్టి మాఫియా… రైల్వే పనుల పేరిట అక్రమ తవ్వకాలు! కదం తొక్కిన గిల్.. కోల్‌కతాపై గుజరాత్‌ ఘన విజయం రైతు కుటుంబానికి అండగా రెడ్స్ సంస్థ ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 18, 2026 02:41 PM

స్మశానానికి రోడ్డు లేక ఇబ్బందులు మంచేపల్లి గ్రామంలో గ్రామస్తుల ఆవేదన

స్మశానానికి రోడ్డు లేక ఇబ్బందులు మంచేపల్లి గ్రామంలో గ్రామస్తుల ఆవేదన

స్మశానానికి రోడ్డు లేక ఇబ్బందులు మంచేపల్లి గ్రామంలో గ్రామస్తుల ఆవేదన
April 18, 2026 11:58 AM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

సోమందేపల్లి మండలం మంచేపల్లి: గ్రామంలో ఎవరైనా మరణించినప్పుడు స్మశాన వాటికకు వెళ్లేందుకు సరైన రహదారి లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో మట్టి మార్గం పూర్తిగా దెబ్బతినడంతో మృతదేహాలను తీసుకెళ్లడం మరింత కష్టసాధ్యంగా మారుతోంది.

గ్రామస్తుల సమస్యల మేరకు సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, మండల కన్వీనర్ నడింపల్లి వెంకటేష్, శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్, రహమతుల్లా, లక్ష్మీనారాయణ, శాంతరాజు కలిసి ప్రాంతాన్ని పరిశీలించారు. పరిస్థితి అత్యంత ఇబ్బందికరంగా ఉందని వారు గుర్తించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ రహదారి సమస్యను గౌరవ మంత్రివర్యులు సబితమ్మ గారి దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే రోడ్డు మంజూరు చేయించేలా చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

గ్రామ ప్రజలు తక్షణమే రహదారి నిర్మాణం చేపట్టి తమ ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News