స్మశానానికి రోడ్డు లేక ఇబ్బందులు మంచేపల్లి గ్రామంలో గ్రామస్తుల ఆవేదన
స్మశానానికి రోడ్డు లేక ఇబ్బందులు మంచేపల్లి గ్రామంలో గ్రామస్తుల ఆవేదన
Prakash
సోమందేపల్లి మండలం మంచేపల్లి: గ్రామంలో ఎవరైనా మరణించినప్పుడు స్మశాన వాటికకు వెళ్లేందుకు సరైన రహదారి లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో మట్టి మార్గం పూర్తిగా దెబ్బతినడంతో మృతదేహాలను తీసుకెళ్లడం మరింత కష్టసాధ్యంగా మారుతోంది.
గ్రామస్తుల సమస్యల మేరకు సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, మండల కన్వీనర్ నడింపల్లి వెంకటేష్, శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్, రహమతుల్లా, లక్ష్మీనారాయణ, శాంతరాజు కలిసి ప్రాంతాన్ని పరిశీలించారు. పరిస్థితి అత్యంత ఇబ్బందికరంగా ఉందని వారు గుర్తించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ రహదారి సమస్యను గౌరవ మంత్రివర్యులు సబితమ్మ గారి దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే రోడ్డు మంజూరు చేయించేలా చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
గ్రామ ప్రజలు తక్షణమే రహదారి నిర్మాణం చేపట్టి తమ ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి