Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 11:53 PM

స్మశానానికి రోడ్డు లేక ఇబ్బందులు మంచేపల్లి గ్రామంలో గ్రామస్తుల ఆవేదన

స్మశానానికి రోడ్డు లేక ఇబ్బందులు మంచేపల్లి గ్రామంలో గ్రామస్తుల ఆవేదన

స్మశానానికి రోడ్డు లేక ఇబ్బందులు మంచేపల్లి గ్రామంలో గ్రామస్తుల ఆవేదన
April 18, 2026 11:58 AM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

సోమందేపల్లి మండలం మంచేపల్లి: గ్రామంలో ఎవరైనా మరణించినప్పుడు స్మశాన వాటికకు వెళ్లేందుకు సరైన రహదారి లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో మట్టి మార్గం పూర్తిగా దెబ్బతినడంతో మృతదేహాలను తీసుకెళ్లడం మరింత కష్టసాధ్యంగా మారుతోంది.

గ్రామస్తుల సమస్యల మేరకు సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, మండల కన్వీనర్ నడింపల్లి వెంకటేష్, శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్, రహమతుల్లా, లక్ష్మీనారాయణ, శాంతరాజు కలిసి ప్రాంతాన్ని పరిశీలించారు. పరిస్థితి అత్యంత ఇబ్బందికరంగా ఉందని వారు గుర్తించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ రహదారి సమస్యను గౌరవ మంత్రివర్యులు సబితమ్మ గారి దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే రోడ్డు మంజూరు చేయించేలా చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

గ్రామ ప్రజలు తక్షణమే రహదారి నిర్మాణం చేపట్టి తమ ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News