Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:34 AM

స్మశానానికి రోడ్డు లేక ఇబ్బందులు మంచేపల్లి గ్రామంలో గ్రామస్తుల ఆవేదన

స్మశానానికి రోడ్డు లేక ఇబ్బందులు మంచేపల్లి గ్రామంలో గ్రామస్తుల ఆవేదన

స్మశానానికి రోడ్డు లేక ఇబ్బందులు మంచేపల్లి గ్రామంలో గ్రామస్తుల ఆవేదన
18-04-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

సోమందేపల్లి మండలం మంచేపల్లి: గ్రామంలో ఎవరైనా మరణించినప్పుడు స్మశాన వాటికకు వెళ్లేందుకు సరైన రహదారి లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో మట్టి మార్గం పూర్తిగా దెబ్బతినడంతో మృతదేహాలను తీసుకెళ్లడం మరింత కష్టసాధ్యంగా మారుతోంది.

గ్రామస్తుల సమస్యల మేరకు సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, మండల కన్వీనర్ నడింపల్లి వెంకటేష్, శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్, రహమతుల్లా, లక్ష్మీనారాయణ, శాంతరాజు కలిసి ప్రాంతాన్ని పరిశీలించారు. పరిస్థితి అత్యంత ఇబ్బందికరంగా ఉందని వారు గుర్తించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ రహదారి సమస్యను గౌరవ మంత్రివర్యులు సబితమ్మ గారి దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే రోడ్డు మంజూరు చేయించేలా చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

గ్రామ ప్రజలు తక్షణమే రహదారి నిర్మాణం చేపట్టి తమ ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు.

Sthanikam

స్మశానానికి రోడ్డు లేక ఇబ్బందులు మంచేపల్లి గ్రామంలో గ్రామస్తుల ఆవేదన

Article Image

సోమందేపల్లి మండలం మంచేపల్లి: గ్రామంలో ఎవరైనా మరణించినప్పుడు స్మశాన వాటికకు వెళ్లేందుకు సరైన రహదారి లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో మట్టి మార్గం పూర్తిగా దెబ్బతినడంతో మృతదేహాలను తీసుకెళ్లడం మరింత కష్టసాధ్యంగా మారుతోంది.

గ్రామస్తుల సమస్యల మేరకు సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ, మండల కన్వీనర్ నడింపల్లి వెంకటేష్, శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్, రహమతుల్లా, లక్ష్మీనారాయణ, శాంతరాజు కలిసి ప్రాంతాన్ని పరిశీలించారు. పరిస్థితి అత్యంత ఇబ్బందికరంగా ఉందని వారు గుర్తించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ రహదారి సమస్యను గౌరవ మంత్రివర్యులు సబితమ్మ గారి దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే రోడ్డు మంజూరు చేయించేలా చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

గ్రామ ప్రజలు తక్షణమే రహదారి నిర్మాణం చేపట్టి తమ ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News