సాకరే మారుతీరావుకు టిడిపి నేతల సత్కారం
సాకరే మారుతీరావుకు టిడిపి నేతల సత్కారం
Editor Desk
ఆదోని నియోజకవర్గంలో టిడిపి ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు లను స్వకుల సాలె సమాజానికి చెందిన సాకరే మారుతీరావు మర్యాదపూర్వకంగా వారి నివాసంలో కలిసి సన్మానించారు.
ఈ సందర్భంగా సాకరే మారుతీరావు మాట్లాడుతూ… మార్చి 29న నిర్వహించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీకి సేవలందించిన కార్యకర్తలను విజయవాడలోని ముఖ్యమంత్రి నివాసంలో గౌరవించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా సన్మానం అందుకోవడం జీవితాంతం గుర్తుండిపోయే ఘనతగా అభివర్ణించారు.
ఇలాంటి గౌరవం లభించడానికి సహకరించిన మీనాక్షి నాయుడు, ఉమాపతి నాయుడు లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సన్మానితులకు అభినందనలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి