Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:12 PM

సాకరే మారుతీరావుకు టిడిపి నేతల సత్కారం

సాకరే మారుతీరావుకు టిడిపి నేతల సత్కారం

సాకరే మారుతీరావుకు టిడిపి నేతల సత్కారం
01-04-2026 125 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని నియోజకవర్గంలో టిడిపి ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు లను స్వకుల సాలె సమాజానికి చెందిన సాకరే మారుతీరావు మర్యాదపూర్వకంగా వారి నివాసంలో కలిసి సన్మానించారు.

ఈ సందర్భంగా సాకరే మారుతీరావు మాట్లాడుతూ… మార్చి 29న నిర్వహించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీకి సేవలందించిన కార్యకర్తలను విజయవాడలోని ముఖ్యమంత్రి నివాసంలో గౌరవించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా సన్మానం అందుకోవడం జీవితాంతం గుర్తుండిపోయే ఘనతగా అభివర్ణించారు.

ఇలాంటి గౌరవం లభించడానికి సహకరించిన మీనాక్షి నాయుడు, ఉమాపతి నాయుడు లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సన్మానితులకు అభినందనలు తెలిపారు.

Sthanikam

సాకరే మారుతీరావుకు టిడిపి నేతల సత్కారం

Article Image

ఆదోని నియోజకవర్గంలో టిడిపి ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు లను స్వకుల సాలె సమాజానికి చెందిన సాకరే మారుతీరావు మర్యాదపూర్వకంగా వారి నివాసంలో కలిసి సన్మానించారు.

ఈ సందర్భంగా సాకరే మారుతీరావు మాట్లాడుతూ… మార్చి 29న నిర్వహించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీకి సేవలందించిన కార్యకర్తలను విజయవాడలోని ముఖ్యమంత్రి నివాసంలో గౌరవించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా సన్మానం అందుకోవడం జీవితాంతం గుర్తుండిపోయే ఘనతగా అభివర్ణించారు.

ఇలాంటి గౌరవం లభించడానికి సహకరించిన మీనాక్షి నాయుడు, ఉమాపతి నాయుడు లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సన్మానితులకు అభినందనలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News