Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేణుక ఎల్లమ్మ సన్నిధిలో బాలుడి అన్నప్రాశన. డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 08:25 PM

సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఇఫ్తార్ విందు

సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఇఫ్తార్ విందు

సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఇఫ్తార్ విందు
March 12, 2026 10:11 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని గురువారం సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఇఫ్తార్ విందు నిర్వహించారు. స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బి. చంద్ర మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్ (ఐపీఎస్) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రంజాన్ మాసం ప్రాముఖ్యతను వివరిస్తూ పరస్పర సౌహార్దం, సామరస్య భావాలు సమాజంలో మరింత బలపడాలని అధికారులు ఆకాంక్షించారు. పోలీసు శాఖ, మీడియా ప్రతినిధులు, స్థానిక ప్రజల మధ్య సమన్వయం పెంపొందించడమే లక్ష్యంగా ఈ ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వివిధ సెక్టార్‌ల ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది, మీడియా ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

రంజాన్ మాసం సందర్భంగా పరస్పర సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా ఈ కార్యక్రమం నిర్వహించడం విశేషమని పలువురు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News