సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఇఫ్తార్ విందు
సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఇఫ్తార్ విందు
RAPOLU LINGASWAMY
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని గురువారం సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఇఫ్తార్ విందు నిర్వహించారు. స్టేషన్ ఇన్స్పెక్టర్ బి. చంద్ర మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్ (ఐపీఎస్) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రంజాన్ మాసం ప్రాముఖ్యతను వివరిస్తూ పరస్పర సౌహార్దం, సామరస్య భావాలు సమాజంలో మరింత బలపడాలని అధికారులు ఆకాంక్షించారు. పోలీసు శాఖ, మీడియా ప్రతినిధులు, స్థానిక ప్రజల మధ్య సమన్వయం పెంపొందించడమే లక్ష్యంగా ఈ ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ సెక్టార్ల ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది, మీడియా ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
రంజాన్ మాసం సందర్భంగా పరస్పర సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా ఈ కార్యక్రమం నిర్వహించడం విశేషమని పలువురు అభిప్రాయపడ్డారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి