Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణలో అధికారులు బాధ్యతగా పనిచేయాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 03:15 AM

రూ.10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం నిందితుడి అరెస్ట్

రూ.10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం నిందితుడి అరెస్ట్

రూ.10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం నిందితుడి అరెస్ట్
May 29, 2026 08:41 PM 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, న్యూస్‌టుడే: ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగిలించిన మోటార్ సైకిళ్ల కేసును పోలీసులు ఛేదించారు. రూ.10 లక్షల విలువైన 12 బైక్‌లను స్వాధీనం చేసుకుని ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు.


టూ టౌన్ సీఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం ఆదోని పట్టణంలోని లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా బైక్‌పై వెళ్తున్న కర్నూలు జిల్లా హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31)ను అదుపులోకి తీసుకుని విచారించారు.

విచారణలో నిందితుడు ఆదోని వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్, ఆదోని తాలూకా, పత్తికొండతో పాటు వివిధ పోలీస్ స్టేషన్ పరిధుల్లో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు.

నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఆదోని–ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలోని రహస్య ప్రదేశంలో దాచిన 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని తెలిపారు.

నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని సీఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News