రూ.10 లక్షల విలువైన 12 బైక్లు స్వాధీనం నిందితుడి అరెస్ట్
రూ.10 లక్షల విలువైన 12 బైక్లు స్వాధీనం నిందితుడి అరెస్ట్
Editor Desk
ఆదోని, న్యూస్టుడే: ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగిలించిన మోటార్ సైకిళ్ల కేసును పోలీసులు ఛేదించారు. రూ.10 లక్షల విలువైన 12 బైక్లను స్వాధీనం చేసుకుని ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు.
టూ టౌన్ సీఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం ఆదోని పట్టణంలోని లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా బైక్పై వెళ్తున్న కర్నూలు జిల్లా హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31)ను అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో నిందితుడు ఆదోని వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్, ఆదోని తాలూకా, పత్తికొండతో పాటు వివిధ పోలీస్ స్టేషన్ పరిధుల్లో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు.
నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఆదోని–ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలోని రహస్య ప్రదేశంలో దాచిన 12 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని తెలిపారు.
నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని సీఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి