రోడ్డు భద్రత... అందరి బాధ్యత: ట్రాఫిక్ సిఐ వెంకటేష్
రోడ్డు భద్రత... అందరి బాధ్యత: ట్రాఫిక్ సిఐ వెంకటేష్
K.RAVI
చౌటుప్పల్లో ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన సదస్సు
రోడ్డు విస్తరణ పనుల వేళ వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి
ప్రయాణాల్లో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాలకే ముప్పు తెస్తుందని, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని చౌటుప్పల్ ట్రాఫిక్ సీఐ నందగిరి వెంకటేష్ అన్నారు. జిల్లా ఎస్పీ, డివిజన్ ట్రాఫిక్ డీఎస్పీల ఆదేశాల మేరకు బుధవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఆటో డ్రైవర్లు, విద్యార్థులు, స్థానికులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
నారాయణపురం ఎక్స్ రోడ్డు వద్ద సీఐ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో సీటుబెల్టు తప్పనిసరిగా ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రస్తుతం పట్టణంలో జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నందున, వాహనదారులు హెచ్చరిక బోర్డులను గమనిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఆటో యూనియన్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి