PRINT TIME: May 27, 2026 04:06 AM
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి బాధిత కుటుంబానికి దైద రవీందర్ ఆర్థిక సాయం
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి బాధిత కుటుంబానికి దైద రవీందర్ ఆర్థిక సాయం
March 20, 2026 05:20 PM
262 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
కట్టంగూర్: మండలంలోని ఎరసానిగూడెం గ్రామానికి చెందిన కడారి శివాజీ యాదవ్ (18) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్, మృతదేహానికి పూలమాలలు అర్పించి నివాళులు అర్పించారు. అనంతరం దహన సంస్కారాల నిమిత్తం రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, ఇలాంటి దుర్ఘటనల సమయంలో పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాపాల రాఘవరెడ్డి, నాయకులు కొమ్మనవైన శంకర్ యాదవ్, చెరుకు యాదయ్య, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, గంగాదేవి నాగమ్మ, ముప్పిడి శిరీష, బండారు నరేష్, ముప్పిడి నరసింహ, కర్రు నరసింహ, యాపాల వెంకటరెడ్డి, కడారి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి