Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిరుమర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రామన్నపేట రిపోర్టర్లు రెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహ కార్యక్రమం ఉధంపూర్‌లో ఘోర ప్రమాదం: 100 అడుగుల లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 20, 2026 08:12 PM

రంగమ్మగూడెంలో ఐకెపి కొనుగోలు కేంద్రం ప్రారంభం.

రంగమ్మగూడెంలో ఐకెపి కొనుగోలు కేంద్రం ప్రారంభం.

రంగమ్మగూడెంలో ఐకెపి కొనుగోలు కేంద్రం ప్రారంభం.
April 20, 2026 06:34 PM 98 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామపంచాయతీ పరిధిలోని రంగమ్మగూడెంలో ఐకెపి మార్కెట్ సెంటర్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ దుండిగళ్ళ సత్తయ్య, మార్కెట్ వైస్ చైర్మన్ సింగిరెడ్డి మల్లారెడ్డి పాల్గొన్నారు.

గ్రామ సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్, ఉపసర్పంచ్ పాండు, 10వ వార్డు సభ్యుడు వంగల అవినాష్ చేతుల మీదుగా ఐకెపి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని నేరుగా విక్రయించేందుకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

రంగమ్మగూడెంలో ఏర్పాటు చేసిన ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా రైతులకు సకాలంలో మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఐకెపి మార్కెట్ సభ్యులు గునుగంటి సురేందర్ రావు, మాండ్ర పూజ, వేముల రోజా, నడిగోటి శృతి, సింగిల్ విండో డైరెక్టర్ రామ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వేముల దయాకర్, పిండి సైదులు, తెడ్ల సత్యనారాయణ, చిల్ల మధు, మాధవరం కిషన్ రావు, సుదగాని సత్తయ్య, పనకంటి లింగారావు, పనకంటి కిషన్ రావు, నాగులవంచ శ్రీకాంత్, మండ్ర సత్తయ్య, మద్దెగళ్ళ శీను, మండ్ర ఉపేందర్ తదితరులతో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News