రంగమ్మగూడెంలో ఐకెపి కొనుగోలు కేంద్రం ప్రారంభం.
రంగమ్మగూడెంలో ఐకెపి కొనుగోలు కేంద్రం ప్రారంభం.
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామపంచాయతీ పరిధిలోని రంగమ్మగూడెంలో ఐకెపి మార్కెట్ సెంటర్ను సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ దుండిగళ్ళ సత్తయ్య, మార్కెట్ వైస్ చైర్మన్ సింగిరెడ్డి మల్లారెడ్డి పాల్గొన్నారు.
గ్రామ సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్, ఉపసర్పంచ్ పాండు, 10వ వార్డు సభ్యుడు వంగల అవినాష్ చేతుల మీదుగా ఐకెపి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని నేరుగా విక్రయించేందుకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
రంగమ్మగూడెంలో ఏర్పాటు చేసిన ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా రైతులకు సకాలంలో మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఐకెపి మార్కెట్ సభ్యులు గునుగంటి సురేందర్ రావు, మాండ్ర పూజ, వేముల రోజా, నడిగోటి శృతి, సింగిల్ విండో డైరెక్టర్ రామ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వేముల దయాకర్, పిండి సైదులు, తెడ్ల సత్యనారాయణ, చిల్ల మధు, మాధవరం కిషన్ రావు, సుదగాని సత్తయ్య, పనకంటి లింగారావు, పనకంటి కిషన్ రావు, నాగులవంచ శ్రీకాంత్, మండ్ర సత్తయ్య, మద్దెగళ్ళ శీను, మండ్ర ఉపేందర్ తదితరులతో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి