Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 10:42 PM

రెడ్లరేపాక గ్రామంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీడీవో జలంధర్ రెడ్డి

రెడ్లరేపాక గ్రామంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీడీవో జలంధర్ రెడ్డి

రెడ్లరేపాక గ్రామంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీడీవో జలంధర్ రెడ్డి
29-01-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
వలిగొండ స్థానికం ప్రధాన ప్రతినిధి

వలిగొండ మండలంలోని రెడ్లరేపాక గ్రామాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి. జలెండర్ రెడ్డి నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ దేశాబోయిన బాలస్వామి, గ్రామ కార్యదర్శితో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా గ్రామంలోని హైస్కూల్లో నిర్మాణంలో ఉన్న కాంపౌండ్ వాల్ పనులను పరిశీలించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి. అమృతం తెలిపిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అనంతరం ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి సిబ్బంది హాజరు రిజిస్టర్లు, ఆహార నిల్వలు, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. పిల్లలతో నేరుగా మాట్లాడి భోజనం నాణ్యతపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో వంద శాతం హాజరు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో చేరేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు.

Sthanikam

రెడ్లరేపాక గ్రామంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీడీవో జలంధర్ రెడ్డి

Article Image
వలిగొండ స్థానికం ప్రధాన ప్రతినిధి

వలిగొండ మండలంలోని రెడ్లరేపాక గ్రామాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి. జలెండర్ రెడ్డి నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ దేశాబోయిన బాలస్వామి, గ్రామ కార్యదర్శితో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా గ్రామంలోని హైస్కూల్లో నిర్మాణంలో ఉన్న కాంపౌండ్ వాల్ పనులను పరిశీలించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి. అమృతం తెలిపిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అనంతరం ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి సిబ్బంది హాజరు రిజిస్టర్లు, ఆహార నిల్వలు, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. పిల్లలతో నేరుగా మాట్లాడి భోజనం నాణ్యతపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో వంద శాతం హాజరు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో చేరేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News