PRINT TIME: July 20, 2026 09:23 PM
రాయరావుపేటకు తాగునీటి ఊరట. రూ.4 లక్షలతో బోరు.. ఎమ్మెల్యే కుంభం అనిల్కు గ్రామస్తుల కృతజ్ఞతలు.
రాయరావుపేటకు తాగునీటి ఊరట. రూ.4 లక్షలతో బోరు.. ఎమ్మెల్యే కుంభం అనిల్కు గ్రామస్తుల కృతజ్ఞతలు.
July 19, 2026 10:52 PM
19 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
బీబీనగర్, జూలై 19: మండలంలోని రాయరావుపేట గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి రూ.4 లక్షలు మంజూరు చేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆదివారం గ్రామంలో బోరు తవ్వకాలు ప్రారంభించారు.
గ్రామంలో తీవ్రంగా ఉన్న మంచినీటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే స్పందించి నిధులు విడుదల చేయడం పట్ల గ్రామ ప్రజల తరఫున సర్పంచ్ బొర్ర రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తొలగేలా చర్యలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శివ నాగరాజు గౌడ్, వార్డు సభ్యులు, పీఏసీఎస్ డైరెక్టర్ రంగోల్ల శ్రీనివాస్, రంగోల్ల సతీష్, కలకొండ జయప్రకాష్తో పాటు గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి