రాష్ట్ర బడ్జెట్లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలి: డీవైఎఫ్ఐ
రాష్ట్ర బడ్జెట్లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలి: డీవైఎఫ్ఐ
స్థానికం బృందం
రానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించి యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) డిమాండ్ చేసింది. శనివారం నల్లగొండలోని డీవైఎఫ్ఐ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకు నిరుద్యోగం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రుణాల ద్వారా ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజీవ్ యువ వికాస్ పథకాన్ని వెంటనే అమలు చేసి అర్హులైన నిరుద్యోగులకు రుణాలు అందించాలని డిమాండ్ చేశారు.
రానున్న బడ్జెట్ సమావేశాల్లో యువజన రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ అధిక నిధులు కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సమావేశంలో డీవైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి, నాయకులు పోకల శశిధర్, ఖమ్మంపాటి ఆంజనేయులు, రాము, కార్తీక్, యాదగిరి, శివ, రఘు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి