Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:11 AM

రాష్ట్ర బడ్జెట్‌లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలి: డీవైఎఫ్‌ఐ

రాష్ట్ర బడ్జెట్‌లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలి: డీవైఎఫ్‌ఐ

రాష్ట్ర బడ్జెట్‌లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలి: డీవైఎఫ్‌ఐ
14-03-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించి యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) డిమాండ్ చేసింది. శనివారం నల్లగొండలోని డీవైఎఫ్‌ఐ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకు నిరుద్యోగం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రుణాల ద్వారా ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజీవ్ యువ వికాస్ పథకాన్ని వెంటనే అమలు చేసి అర్హులైన నిరుద్యోగులకు రుణాలు అందించాలని డిమాండ్ చేశారు.

రానున్న బడ్జెట్ సమావేశాల్లో యువజన రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ అధిక నిధులు కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సమావేశంలో డీవైఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి, నాయకులు పోకల శశిధర్, ఖమ్మంపాటి ఆంజనేయులు, రాము, కార్తీక్, యాదగిరి, శివ, రఘు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రాష్ట్ర బడ్జెట్‌లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలి: డీవైఎఫ్‌ఐ

Article Image

రానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించి యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) డిమాండ్ చేసింది. శనివారం నల్లగొండలోని డీవైఎఫ్‌ఐ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల నరేష్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకు నిరుద్యోగం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రుణాల ద్వారా ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజీవ్ యువ వికాస్ పథకాన్ని వెంటనే అమలు చేసి అర్హులైన నిరుద్యోగులకు రుణాలు అందించాలని డిమాండ్ చేశారు.

రానున్న బడ్జెట్ సమావేశాల్లో యువజన రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ అధిక నిధులు కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సమావేశంలో డీవైఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి, నాయకులు పోకల శశిధర్, ఖమ్మంపాటి ఆంజనేయులు, రాము, కార్తీక్, యాదగిరి, శివ, రఘు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News