Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 04:22 AM

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి… కుటుంబానికి కాంగ్రెస్ నేత దైద రవీందర్ పరామర్శ

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి… కుటుంబానికి కాంగ్రెస్ నేత దైద రవీందర్ పరామర్శ

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి… కుటుంబానికి కాంగ్రెస్ నేత దైద రవీందర్ పరామర్శ
December 30, 2025 04:39 PM 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
నకిరేకల్ స్థానికం ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో రామోజు రామ్ చరణ్ చారి మృతి చెందారు. ఈ విషాద ఘటనపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆయన, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా దహన సంస్కారాలకు రూ.5,000/- ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని మృతునికి చివరి వీడ్కోలు పలికారు.

అనుకోని ప్రమాదంలో యువకుడి మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్న దైద రవీందర్, బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటన నియోజకవర్గంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News