PRINT TIME: February 24, 2026 04:22 AM
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి… కుటుంబానికి కాంగ్రెస్ నేత దైద రవీందర్ పరామర్శ
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి… కుటుంబానికి కాంగ్రెస్ నేత దైద రవీందర్ పరామర్శ
December 30, 2025 04:39 PM
50 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
నకిరేకల్ స్థానికం ప్రతినిధి
నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో రామోజు రామ్ చరణ్ చారి మృతి చెందారు. ఈ విషాద ఘటనపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆయన, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా దహన సంస్కారాలకు రూ.5,000/- ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని మృతునికి చివరి వీడ్కోలు పలికారు.
అనుకోని ప్రమాదంలో యువకుడి మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్న దైద రవీందర్, బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటన నియోజకవర్గంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి