Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:54 AM

రోడ్డు భద్రతపై 1,300 మంది విద్యార్థులతో మోత్కూర్‌లో విస్తృత అవగాహన కార్యక్రమం

రోడ్డు భద్రతపై 1,300 మంది విద్యార్థులతో మోత్కూర్‌లో విస్తృత అవగాహన కార్యక్రమం

రోడ్డు భద్రతపై 1,300 మంది విద్యార్థులతో మోత్కూర్‌లో విస్తృత అవగాహన కార్యక్రమం
January 03, 2026 09:06 PM 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జాతీయ రోడ్డు భద్రతా మాసంలో మోత్కూర్‌లో భారీ అవగాహన కార్యక్రమం

యాదాద్రి భువనగిరి స్థానికం రిపోర్టర్

జాతీయ రోడ్డు భద్రతా మాసం–2026 సందర్భంగా మోత్కూర్ వైజే ఫంక్షన్ హాల్‌లో 1,300 మంది పాఠశాల విద్యార్థులతో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.మోత్కూర్ పట్టణంలోని వైజే ఫంక్షన్ హాల్ వేదికగా జాతీయ రోడ్డు భద్రతా మాసం–2026లో భాగంగా శుక్రవారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 1,300 మంది విద్యార్థులు పాల్గొని రోడ్డు నియమాలు, ట్రాఫిక్ సంకేతాల ప్రాముఖ్యతపై అవగాహన పొందార

రోడ్డు ప్రమాదాల నివారణలో విద్యార్థుల పాత్ర కీలకమని, చిన్న వయసు నుంచే ట్రాఫిక్ నియమాలను అలవాటు చేసుకోవడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని వక్తలు పేర్కొన్నారు. హెల్మెట్ వినియోగం, సీటుబెల్ట్ తప్పనిసరి, వేగ నియంత్రణ, మొబైల్ ఫోన్ వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రత్యేకంగా వివరించారు.


ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లు, జెడ్పీహెచ్‌ఎస్‌, సాంఘిక సంక్షేమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొని రోడ్డు భద్రతపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. విద్యార్థులు నేర్చుకున్న విషయాలను తమ కుటుంబ సభ్యులు, సమాజానికి చేరవేయాలని పిలుపునిచ్చారు.పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొనడంతో మోత్కూర్‌లో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News