Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి నిదర్శనం… బాధలోనూ తోడుగా నిలిచిన మిత్రులు రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “కల్తీకి చెక్… రాష్ట్రంలో కొత్త నియంత్రణ యంత్రాంగం” “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” ఇరాన్‌పై యుద్ధం ఆపాలి: హైదరాబాద్‌లో వామపక్షాల భారీ యుద్ధవ్యతిరేక ర్యాలీ 14 ఏళ్ల సెంటిమెంట్‌ బద్దలు.. కేకేఆర్‌పై ముంబై రికార్డ్ విక్టరీ.. చెలరేగిన రోహిత్, రికెల్టన్! అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 30, 2026 10:25 PM

రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత..

రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత..

రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత..
March 30, 2026 08:21 PM 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

రోడ్డు భద్రతపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అవగాహన..

పోలీసు కళాబృందంతో వినూత్నంగా ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం..

ఆకట్టుకున్న యమధర్మరాజు వేషధారణ..

నల్గొండ : రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకుంటారని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ పట్టణ క్లాక్ టవర్ సెంటర్లో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా అతివేగం, అజాగ్రత్త మరియు ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వాహనదారుడు బాధ్యతగా వ్యవహరించినప్పుడే ప్రమాదాల రహిత జిల్లాగా తీర్చిదిద్దగలమని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ కళాబృందం నిర్వహించిన ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా యమధర్మరాజు వేషధారణలో కళాకారులు రహదారిపైకి వచ్చి, హెల్మెట్ ధరించని వాహనదారులకు కలిగే ప్రమాదాలను వివరించడం అందరినీ ఆలోచింపజేసింది. చిన్నారులు తమ నృత్యాల ద్వారా రోడ్డు భద్రతా సందేశాలను ప్రజలకు చేరవేశారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాద సమయాల్లో ప్రాణనష్టం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ సూచించారు.

ముఖ్యంగా యువత అతివేగంతో వాహనాలు నడపడం వల్ల విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలకు రోడ్డు భద్రతపై తగిన మార్గదర్శకత్వం ఇవ్వాలని ఎస్పీ కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు తమ వెంట అవసరమైన పత్రాలను ఉంచుకోవాలని, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని, డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్లు వాడకూడదని హితవు పలికారు. రాబోయే రోజుల్లో విద్యాసంస్థలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాం రెడ్డి, సీఐలు రాము, రాజశేఖర్ రెడ్డి, మహాలక్ష్మయ్య, కరుణాకర్, ఎస్సైలు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News