రామతీర్థం పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన సర్పంచ్
రామతీర్థం పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించిన సర్పంచ్
Reporter Sangameshwar Reddy
న్యాల్కల్ మండలంలోని రామతీర్థం గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కూర్చొని భోజనం చేసి ఆహారం నాణ్యతను పరిశీలించారు. భోజనం పరిశుభ్రంగా ఉండటం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థుల చదువు స్థాయి గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన బోధనతో పాటు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పించిందని తెలిపారు.అలాగే విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు మాధవి, గ్రామ యువ నాయకులు సందీప్, శ్రీకాంత్, గ్రామస్తులు గోరేమియా, సంజీవులు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి