Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:13 AM

రామన్నపేటలో ఉద్రిక్తత… తెలంగాణ ఉద్యమ నాయకుల అరెస్టులు

రామన్నపేటలో ఉద్రిక్తత… తెలంగాణ ఉద్యమ నాయకుల అరెస్టులు

రామన్నపేటలో ఉద్రిక్తత… తెలంగాణ ఉద్యమ నాయకుల అరెస్టులు
March 30, 2026 08:25 AM 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో సోమవారం తెల్లవారుజామున పోలీసులు ముందస్తు చర్యలకు దిగారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ షేక్ చాంద్‌ను రామన్నపేట టౌన్ పోలీసులు అరెస్టు చేయగా, తెలంగాణ ఉద్యమ నాయకుడు బొడ్డుపల్లి లింగయ్యను హౌస్ అరెస్టు చేశారు.

అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి తమ సంఘానికి ఎలాంటి సంబంధం లేదని షేక్ చాంద్ వాదించినప్పటికీ, పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం వాయిదా వేసినప్పటికీ, ముందస్తు జాగ్రత్త చర్యగా బోగారం గ్రామానికి చెందిన బొడ్డుపల్లి లింగయ్యను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.

ఈ పరిణామాలతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ నాయకుల అరెస్టులను ఖండిస్తూ ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News