రామన్నపేటలో ఉద్రిక్తత… తెలంగాణ ఉద్యమ నాయకుల అరెస్టులు
రామన్నపేటలో ఉద్రిక్తత… తెలంగాణ ఉద్యమ నాయకుల అరెస్టులు
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో సోమవారం తెల్లవారుజామున పోలీసులు ముందస్తు చర్యలకు దిగారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ షేక్ చాంద్ను రామన్నపేట టౌన్ పోలీసులు అరెస్టు చేయగా, తెలంగాణ ఉద్యమ నాయకుడు బొడ్డుపల్లి లింగయ్యను హౌస్ అరెస్టు చేశారు.
అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి తమ సంఘానికి ఎలాంటి సంబంధం లేదని షేక్ చాంద్ వాదించినప్పటికీ, పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం వాయిదా వేసినప్పటికీ, ముందస్తు జాగ్రత్త చర్యగా బోగారం గ్రామానికి చెందిన బొడ్డుపల్లి లింగయ్యను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
ఈ పరిణామాలతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ నాయకుల అరెస్టులను ఖండిస్తూ ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి