Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:09 AM

రామన్నపేటలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రామన్నపేటలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రామన్నపేటలో  టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
March 29, 2026 12:56 PM 96 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలి.రాపోలు నరసింహా

రామన్నపేట మండలంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ శాఖ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించాలనే లక్ష్యంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఈ పార్టీపై ప్రజల్లో అపారమైన గౌరవం ఉందన్నారు. అనేక మంది నాయకులు ఈ పార్టీ ద్వారా ఎదిగారని, కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దే రాజకీయ విశ్వవిద్యాలయం ఇదేనని పేర్కొన్నారు.

ప్రపంచ స్థాయి విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయడం గర్వకారణమని చెప్పారు. భవిష్యత్తులో తెలంగాణలో కూడా పార్టీ పూర్వ వైభవం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ దిశగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత బలోపేతం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల అధ్యక్షుడు మీర్జా ఫజల్ బేగ్, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి నకిరేకంటి గణేష్, మండల ఉపాధ్యక్షుడు బత్తుల సత్యం, నాయకులు గాదజానీ, గంజి వీరయ్య, కొంపెల్లి వీరేశం, నరసింహ, మోటే రాజు, గొప్పల నరసింహ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News