Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పసునూరు లో శ్రీరామనవమి సందర్భంగా ట్రాక్టర్ పోటీలు సన్‌రైజర్స్‌పై ఆర్సీబీ ఘన విజయం.. ఉప్పెనలా చెలరేగిన కోహ్లీ, పడిక్కల్! అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ పుస్తకాల కోసం ఇల్లు కట్టిన విశ్వ రత్న: డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అక్షర యాత్ర “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” 6లోగా అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు శ్రీరామ నవమి సందర్భంగా సుద్దకుంటపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ఊరేగింపు ఘనంగా “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 29, 2026 02:46 PM

రామన్నపేటలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రామన్నపేటలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రామన్నపేటలో  టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
March 29, 2026 12:56 PM 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలి.రాపోలు నరసింహా

రామన్నపేట మండలంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ శాఖ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించాలనే లక్ష్యంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఈ పార్టీపై ప్రజల్లో అపారమైన గౌరవం ఉందన్నారు. అనేక మంది నాయకులు ఈ పార్టీ ద్వారా ఎదిగారని, కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దే రాజకీయ విశ్వవిద్యాలయం ఇదేనని పేర్కొన్నారు.

ప్రపంచ స్థాయి విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయడం గర్వకారణమని చెప్పారు. భవిష్యత్తులో తెలంగాణలో కూడా పార్టీ పూర్వ వైభవం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ దిశగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత బలోపేతం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల అధ్యక్షుడు మీర్జా ఫజల్ బేగ్, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి నకిరేకంటి గణేష్, మండల ఉపాధ్యక్షుడు బత్తుల సత్యం, నాయకులు గాదజానీ, గంజి వీరయ్య, కొంపెల్లి వీరేశం, నరసింహ, మోటే రాజు, గొప్పల నరసింహ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News