రామన్నపేటలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
రామన్నపేటలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Editor Desk
టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలి.రాపోలు నరసింహా
రామన్నపేట మండలంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ శాఖ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించాలనే లక్ష్యంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఈ పార్టీపై ప్రజల్లో అపారమైన గౌరవం ఉందన్నారు. అనేక మంది నాయకులు ఈ పార్టీ ద్వారా ఎదిగారని, కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దే రాజకీయ విశ్వవిద్యాలయం ఇదేనని పేర్కొన్నారు.
ప్రపంచ స్థాయి విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయడం గర్వకారణమని చెప్పారు. భవిష్యత్తులో తెలంగాణలో కూడా పార్టీ పూర్వ వైభవం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ దిశగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత బలోపేతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల అధ్యక్షుడు మీర్జా ఫజల్ బేగ్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి నకిరేకంటి గణేష్, మండల ఉపాధ్యక్షుడు బత్తుల సత్యం, నాయకులు గాదజానీ, గంజి వీరయ్య, కొంపెల్లి వీరేశం, నరసింహ, మోటే రాజు, గొప్పల నరసింహ తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి