Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హైదరాబాద్‌లో యువజన కాంగ్రెస్ మహా ధర్నా కదం తొక్కిన గిల్.. కోల్‌కతాపై గుజరాత్‌ ఘన విజయం రైతు కుటుంబానికి అండగా రెడ్స్ సంస్థ ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 18, 2026 09:01 PM

రామన్నపేటలో బీజేపీ బిఎల్ఏ-2 కార్యశాల

రామన్నపేటలో బీజేపీ బిఎల్ఏ-2 కార్యశాల

రామన్నపేటలో బీజేపీ బిఎల్ఏ-2 కార్యశాల
April 18, 2026 07:19 PM 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బూత్ లెవల్ అసిస్టెంట్స్ (బిఎల్ఏ-2) మండల కార్యశాల నిర్వహించారు. మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి నకిరేకల్ అసెంబ్లీ ఇన్‌చార్జ్ నకిరేకంటి మొగులయ్య, మండల ఇన్‌చార్జ్ కొరివి శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నెల 25న కట్టంగూరు మండలంలో జరగనున్న నకిరేకల్ నియోజకవర్గ స్థాయి బిఎల్ఏ-2 సమావేశాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని వారు తీవ్రంగా విమర్శించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే సంకల్పంతో బీజేపీ ప్రభుత్వం ముందుకు సాగుతుండగా, కాంగ్రెస్ పార్టీ దీనికి వ్యతిరేకంగా వ్యవహరించడం మహిళల పట్ల అవమానకరమని అన్నారు. మహిళలకు చట్టసభల్లో ప్రాధాన్యం కల్పించడంలో కాంగ్రెస్ ఆసక్తి చూపడం లేదని ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వనం అంజయ్య, సీనియర్ నాయకులు డోగ్పర్తి సుభాష్, కట్ట యాదయ్య, యువమోర్చా జిల్లా కార్యదర్శి అక్కినపల్లి సైదులు, మండల ప్రధాన కార్యదర్శులు జంగిలి సత్యనారాయణ, బెజ్జంకి శివకుమార్, ఉపాధ్యక్షులు బట్టే రమేష్, గజ్జల రాము, కార్యదర్శి బందెల సంజీవ, కోశాధికారి గురుకు జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అలాగే పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News