Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:09 AM

రామన్నపేటలో 10వ తరగతి విద్యార్థినులకు ఎగ్జామ్ పాడ్స్, పెన్స్

రామన్నపేటలో 10వ తరగతి విద్యార్థినులకు ఎగ్జామ్ పాడ్స్, పెన్స్

రామన్నపేటలో 10వ తరగతి విద్యార్థినులకు ఎగ్జామ్ పాడ్స్, పెన్స్
March 13, 2026 02:55 PM 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ప్రభుత్వ బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు పరీక్షల సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని ఎగ్జామ్ పాడ్స్, పెన్స్ పంపిణీ చేశారు. స్ట్రెంత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, బత్తిని రాజు ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా హెచ్‌ఎం & ఎంఈఓ జ్యోతి మేడం మాట్లాడుతూ విద్యార్థినులు పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.

స్ట్రెంత్ ఫౌండేషన్ ఫౌండర్ & చైర్మన్ ఎర్ర నరేష్ మాట్లాడుతూ విద్యార్థినులు కష్టపడి చదివి జ్ఞానం సంపాదించుకోవాలని, విద్యే మనిషికి నిజమైన సంపద అని పేర్కొన్నారు. పరీక్షలను ఆత్మవిశ్వాసంతో రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సభ్యులు బత్తిని రాజు, ఆవుల సాయి, ఆవుల మత్స్యగిరి, అధ్యాపక బృందం మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News