PRINT TIME: March 13, 2026 05:17 PM
రామన్నపేటలో 10వ తరగతి విద్యార్థినులకు ఎగ్జామ్ పాడ్స్, పెన్స్
రామన్నపేటలో 10వ తరగతి విద్యార్థినులకు ఎగ్జామ్ పాడ్స్, పెన్స్
March 13, 2026 02:55 PM
16 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
రామన్నపేట: ప్రభుత్వ బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు పరీక్షల సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని ఎగ్జామ్ పాడ్స్, పెన్స్ పంపిణీ చేశారు. స్ట్రెంత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, బత్తిని రాజు ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా హెచ్ఎం & ఎంఈఓ జ్యోతి మేడం మాట్లాడుతూ విద్యార్థినులు పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.
స్ట్రెంత్ ఫౌండేషన్ ఫౌండర్ & చైర్మన్ ఎర్ర నరేష్ మాట్లాడుతూ విద్యార్థినులు కష్టపడి చదివి జ్ఞానం సంపాదించుకోవాలని, విద్యే మనిషికి నిజమైన సంపద అని పేర్కొన్నారు. పరీక్షలను ఆత్మవిశ్వాసంతో రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సభ్యులు బత్తిని రాజు, ఆవుల సాయి, ఆవుల మత్స్యగిరి, అధ్యాపక బృందం మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి