రామన్నపేటకు ప్రత్యేక నియోజకవర్గం కావాలి. ప్రజల ఐక్యతతోనే సాధ్యం: నకిరేకంటి గణేష్
రామన్నపేటకు ప్రత్యేక నియోజకవర్గం కావాలి. ప్రజల ఐక్యతతోనే సాధ్యం: నకిరేకంటి గణేష్
Editor Desk
రామన్నపేట, ఏప్రిల్ 2: రామన్నపేట ప్రాంత అభివృద్ధి దృష్ట్యా ప్రత్యేక నియోజకవర్గం ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరు పార్టీ భేదాలు పక్కనబెట్టి ఐక్యంగా పోరాడాలని టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు నకిరేకంటి గణేష్ పిలుపునిచ్చారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, డీఎస్పీ పార్టీలు కూడా ముందుకు రావాలని ఆయన కోరారు.
ప్రత్యేక నియోజకవర్గ సాధనే ప్రధాన లక్ష్యంగా ప్రతి పౌరుడు భావించి ఉద్యమంలో భాగస్వాములు కావాలని, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేతలు, మహిళలు చురుకుగా పాల్గొనాలని సూచించారు.
ఉద్యమ విజయానికి పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమని, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా ముందుండాలని అన్నారు.
రామన్నపేటకు ప్రత్యేక నియోజకవర్గం సాధన కోసం అందరూ ఒక్కటై పోరాడితే లక్ష్యం తప్పకుండా నెరవేరుతుందని గణేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి