Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 12:42 AM

రామన్నపేట సర్పంచ్ గరిక సత్యనారాయణకు ఘన సన్మానం

రామన్నపేట సర్పంచ్ గరిక సత్యనారాయణకు ఘన సన్మానం

రామన్నపేట సర్పంచ్ గరిక సత్యనారాయణకు ఘన సన్మానం
March 06, 2026 05:24 PM 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణను ఉపసర్పంచ్ మోటే రమేష్‌తో పాటు పాలకవర్గాన్ని రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి గౌరవాధ్యక్షుడు రెబ్బాసు రాములు ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా రెబ్బాసు రాములు మాట్లాడుతూ రామన్నపేట ఒకప్పుడు ఇబ్రహీంపట్నం నుంచి ఆలేరు వరకు, నల్గొండ నుంచి శాలిగౌరారం వరకు సమితి కేంద్రంగా ఉండేదని తెలిపారు. 1952 నుంచి 2009 వరకు రామన్నపేట నియోజకవర్గ కేంద్రంగా కొనసాగిందని, అనంతరం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నకిరేకల్ నియోజకవర్గంలో కలిపినట్లు పేర్కొన్నారు.

రామన్నపేటకు ప్రత్యేక నియోజకవర్గం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా మండలంలోని అన్ని గ్రామాల ప్రజలతో కలిసి రామన్నపేట నియోజకవర్గ సాధన సమితిని ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లేందుకు వినతిపత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో మండల వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లను సన్మానిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రామన్నపేట నియోజకవర్గ సాధన సమితికి మద్దతు ఇవ్వాలని కోరారు.

అనంతరం సర్పంచ్ గరిక సత్యనారాయణ సాధన సమితి గౌరవాధ్యక్షుడు రెబ్బాసు రాములను శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సాధన సమితి నాయకులు గడ్డం యాదగిరి, బందెల అశోక్, ఎండీ ఇమామ్ సాబ్, నకిరేకంటి నరేష్, పెండెం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News