Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వివాహేతర సంబంధం.. భర్త హత్యకు కుట్ర కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 09:47 AM

రామన్నపేట సర్పంచ్ గరిక సత్యనారాయణకు ఘన సన్మానం

రామన్నపేట సర్పంచ్ గరిక సత్యనారాయణకు ఘన సన్మానం

రామన్నపేట సర్పంచ్ గరిక సత్యనారాయణకు ఘన సన్మానం
March 06, 2026 05:24 PM 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణను ఉపసర్పంచ్ మోటే రమేష్‌తో పాటు పాలకవర్గాన్ని రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి గౌరవాధ్యక్షుడు రెబ్బాసు రాములు ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా రెబ్బాసు రాములు మాట్లాడుతూ రామన్నపేట ఒకప్పుడు ఇబ్రహీంపట్నం నుంచి ఆలేరు వరకు, నల్గొండ నుంచి శాలిగౌరారం వరకు సమితి కేంద్రంగా ఉండేదని తెలిపారు. 1952 నుంచి 2009 వరకు రామన్నపేట నియోజకవర్గ కేంద్రంగా కొనసాగిందని, అనంతరం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నకిరేకల్ నియోజకవర్గంలో కలిపినట్లు పేర్కొన్నారు.

రామన్నపేటకు ప్రత్యేక నియోజకవర్గం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా మండలంలోని అన్ని గ్రామాల ప్రజలతో కలిసి రామన్నపేట నియోజకవర్గ సాధన సమితిని ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లేందుకు వినతిపత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో మండల వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లను సన్మానిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రామన్నపేట నియోజకవర్గ సాధన సమితికి మద్దతు ఇవ్వాలని కోరారు.

అనంతరం సర్పంచ్ గరిక సత్యనారాయణ సాధన సమితి గౌరవాధ్యక్షుడు రెబ్బాసు రాములను శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సాధన సమితి నాయకులు గడ్డం యాదగిరి, బందెల అశోక్, ఎండీ ఇమామ్ సాబ్, నకిరేకంటి నరేష్, పెండెం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News