రామన్నపేట సర్పంచ్ గరిక సత్యనారాయణకు ఘన సన్మానం
రామన్నపేట సర్పంచ్ గరిక సత్యనారాయణకు ఘన సన్మానం
స్థానికం బృందం
రామన్నపేట: రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణను ఉపసర్పంచ్ మోటే రమేష్తో పాటు పాలకవర్గాన్ని రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి గౌరవాధ్యక్షుడు రెబ్బాసు రాములు ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా రెబ్బాసు రాములు మాట్లాడుతూ రామన్నపేట ఒకప్పుడు ఇబ్రహీంపట్నం నుంచి ఆలేరు వరకు, నల్గొండ నుంచి శాలిగౌరారం వరకు సమితి కేంద్రంగా ఉండేదని తెలిపారు. 1952 నుంచి 2009 వరకు రామన్నపేట నియోజకవర్గ కేంద్రంగా కొనసాగిందని, అనంతరం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నకిరేకల్ నియోజకవర్గంలో కలిపినట్లు పేర్కొన్నారు.
రామన్నపేటకు ప్రత్యేక నియోజకవర్గం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా మండలంలోని అన్ని గ్రామాల ప్రజలతో కలిసి రామన్నపేట నియోజకవర్గ సాధన సమితిని ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లేందుకు వినతిపత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో మండల వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను సన్మానిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రామన్నపేట నియోజకవర్గ సాధన సమితికి మద్దతు ఇవ్వాలని కోరారు.
అనంతరం సర్పంచ్ గరిక సత్యనారాయణ సాధన సమితి గౌరవాధ్యక్షుడు రెబ్బాసు రాములను శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సాధన సమితి నాయకులు గడ్డం యాదగిరి, బందెల అశోక్, ఎండీ ఇమామ్ సాబ్, నకిరేకంటి నరేష్, పెండెం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి